సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఎప్పటి నుండో చూస్తున్నాం. అయితే వారసులుగా వచ్చిన వారిలో కొందరు రాణించగా, మరి కొందరు మాత్రం మధ్యలోనే డ్రాప్ అయ్యారు. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో రాబోయే వారసుల లిస్టు అయితే పెద్దగానే ఉంది. అయితే అందులో ఎక్కువగా మాత్రం మహేష్ బాబు పవన్ వారసులపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వారికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా ఇండస్ట్రీలో దాదాపు ఓకే తరహాలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయితే బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో అయితే ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాయి. ఇద్దరు స్టార్ హీరోలో ఫ్యాన్స్ మధ్య అప్పుడప్పుడు కొన్ని గొడవలు కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. ఇదే క్రమంలో ఇప్పుడు గౌతమ్ ఘట్టమనేని , అకిరా నందన్ లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్ మధ్యలో వార్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే విధంగా ఓవర్గం వారు అనవసరపు కామెంట్స్ చేసుకుంటూ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలకు టాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్స్ హాజరయ్యారు. నాగార్జున, రామ్చరణ్, నాగచైతన్య, అఖిల్తో పాటు పలువురు హీరోలు రేసింగ్ పోటీల్లో సందడిచేశారు.
అయితే ఈ పోటీల్లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, మహేష్బాబు వారసుడు గౌతమ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. గౌతమ్ ఘట్టమనేని చాలా రోజుల తర్వాత బాహ్య ప్రపంచంలో కనిపించాడు. ఇక తన స్నేహితులతో కలిసి అకీరా ఈ రేసింగ్ పోటీలను తిలకించాడు. అతడి ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్గా మారాయి. క్యాప్ పెట్టుకొని స్టైలిష్గా అకీరా నందన్ కనిపించాడు. వీరిద్దరిని చూసిన అభిమానులు రాబోయే కాలానికి కాబోయే స్టార్స్ వీరిద్దరు అంటూ నానా రచ్చ చేస్తున్నారు. అంతేకాదు పోటీలు పడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్, మహేష్ల కిడ్స్ ఎప్పుడు ఇండస్ట్రీకి వస్తారో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…