మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి నయనతార కూడా స్పందిస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అల్లు అర్జున్ ఈ సినిమాపై పొడవాటి నోట్ను షేర్ చేస్తూ, Mana ShankaraVara Prasad Garu టీమ్ మొత్తానికి అభినందనలు. బాస్ తిరిగి వచ్చారు. మన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వెండితెరపై మెరవడం చాలా ఆనందంగా ఉంది. ఫుల్ విన్టేజ్ వైబ్స్.. అంటూ ప్రశంసించారు. అలాగే వెంకటేష్ గురించి ప్రస్తావిస్తూ, వెంకీ మామ షోని దుమ్మురేపారు.. అని పేర్కొన్నారు. నయనతార నటనను కూడా మెచ్చుకుంటూ, నయనతార గ్రేస్ఫుల్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది.. అని రాశారు. చివరగా ఈ సినిమాను సంక్రాంతి బాస్ బ్లాక్బస్టర్ గా అభివర్ణించారు.
అల్లు అర్జున్ చేసిన ఈ ప్రశంసలకు నయనతార ఎంతో సరళంగా స్పందించారు. ఆయన పోస్ట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేస్తూ, థ్యాంక్యూ బన్నీ, స్వీట్ ఆఫ్ యూ.. అని రాసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ఏడో రోజుకే ప్రపంచవ్యాప్తంగా రూ. 292 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇది చిరంజీవి కెరీర్లోనే అతిపెద్ద ఓపెనింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమాలో నయనతార సంపన్న వ్యాపారవేత్త కుమార్తె శశిరేఖ పాత్రలో నటించగా, చిరంజీవి ఎన్ఐఏ అధికారి శంకరవరప్రసాద్ పాత్రలో కనిపించారు. ప్రత్యేక ఆకర్షణగా దగ్గుబాటి వెంకటేష్ కీలక పాత్రలో నటించగా, చిరంజీవి – వెంకటేష్ తొలిసారిగా కలిసి వెండితెరపై కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే, పుష్ప 2: ది రూల్ ఘనవిజయం తర్వాత ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 26వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా లోకేష్ కనగరాజ్తో మరో ప్రాజెక్ట్కు కూడా సిద్ధమవుతున్నారు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…