Bangles : ప్రతి ఒక్క మహిళ కూడా చేతులకి గాజులు వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. చేతులకి గాజులు లేకుండా ఉండకూడదని, గాజులు వేసుకోకపోతే మంచిది కాదని అంటూ ఉంటారు. శాస్త్రాలు కూడా స్త్రీలు గాజులు వేసుకోవాలని, ఏ కీడు జరగకుండా గాజులు రక్షణగా ఉంటాయని అంటున్నాయి. అయితే గాజులు వేసుకోవడం వలన అసలు ఏమవుతుంది..?, ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.
అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులని వేస్తూ ఉంటారు. దాని వలన దిష్టి తగలదు. దోషాలు రావు. పైగా ఆ గాజుల శబ్దం ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు. చేతికి నిండుగా గాజులు వేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే మహిళలు ఇంటి వ్యవహారాలను కూడా ఎంతో చక్కగా చూసుకోగలుగుతారని అంటారు. రంగురంగుల గాజులు వేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది.
పైగా ఆ రంగులకి కూడా అర్థాలు ఉన్నాయి. ఎరుపు రంగు గాజులు శక్తిని, నీలిరంగు గాజులు విజ్ఞానాన్ని సూచిస్తాయి. ఆకుపచ్చ అదృష్టాన్ని, పసుపు రంగు సంతోషాన్ని, ఊదా రంగు స్వేచ్ఛని.. సూచిస్తాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం గాజులు సౌభాగ్యానికి చిహ్నం. బంగారం గాజులు ఎన్ని వేసుకున్నా, చేతికి ఒకటి రెండు మట్టి గాజులు వేసుకోవాలని అంటారు. అమ్మవారిని పూజించేటప్పుడు, పసుపు కుంకుమతోపాటు గాజులని కూడా పెట్టి పూజిస్తారు.
మట్టి గాజులు వేసుకుంటే ముత్తైదువుతనాన్ని సూచిస్తుంది. గాజులు పగిలిపోవడం మంచిది కాదని.. అమంగళం, అశుభమని అంటారు. ఇలా గాజులకి ఇంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి పెళ్లయిన ప్రతి స్త్రీ కూడా కచ్చితంగా గాజులని ధరించాలి. గాజులను వేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. కనుక కచ్చితంగా పెళ్లయిన మహిళలు గాజులని వేసుకుని తీరాలి.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…