Stroke : ఈరోజులలో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే, కొన్ని తప్పులు చేయకూడదు. అయితే, ఈ రోజుల్లో స్ట్రోక్ వంటి సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. చాలామంది స్ట్రోక్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే, స్ట్రోక్ వచ్చే ముందు ఏం జరుగుతుంది..?, ఎలాంటి లక్షణాలు ఉంటాయి..?, ఎలా స్ట్రోక్ లని మనం గుర్తించొచ్చు..?, నివారించడం ఎలా వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇస్కిమిక్ స్ట్రోక్ యొక్క లక్షణాలని చూస్తే.. దృష్టి సమస్యలు, చేతులు, కాళ్లు బలహీనంగా మారిపోవడం, సమన్వయాన్ని కోల్పోవడం, ఒకవైపు ముఖం వేలాడుతూ ఉన్నట్లు ఉండడం, గందరగోళం వంటివి దీనికి లక్షణాలు. స్ట్రోక్ యొక్క అత్యంత సాధారణ లక్షణం ఏంటంటే అవయవాల బలహీనత లేదంటే పక్షవాతం. అకస్మాత్తుగా ఇతర లక్షణాలు కూడా కనపడొచ్చు. స్ట్రోక్ రావడానికి కొన్ని గంటల ముందు లేదా కొన్ని రోజులు ముందు ఇటువంటి లక్షణాలు కనబడతాయి.
కండరాల నొప్పి, కండరాల బిగుతు కారణంగా అవయవాల్ని కదిలించలేక పోతారు. శరీరంలో ఎక్కడైనా లేదంటే కీలులో ఇది ఉండొచ్చు. మెదడుకి రక్త సరఫరా తగ్గినప్పుడు, ఇతర అవయవాల మీద కూడా ప్రభావం పడుతుంది. కదలికలు సరిగా లేకపోవడం వంటివి కూడా జరుగుతాయి. కండరాల బిగుతు, తిమ్మిరి కూడా కలగొచ్చు.
స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొన్ని ఆరోగ్య పరిస్థితుల వివరాల్లోకి వెళితే.. అధిక రక్తపోటు, కొవ్వు ఎక్కువగా ఉండడం, గుండెపోటు, రక్తహీనత, రక్తం గడ్డ కట్టడం, షుగర్ పేషెంట్లలో, ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. ఎవరికైనా మీ ఫ్యామిలీలో ఉన్నట్లయితే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణ పరీక్షలు చేయించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీర బరువుని కంట్రోల్ లో ఉంచుకోవడం, గుండెకి మేలు చేసే ఆహారం తీసుకోవడం, మంచి నిద్రతో స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…