ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ ఇల్లు తుడుచుకుంటూ ఉంటారు. ఇంటి బయట కూడా కచ్చితంగా రోజూ తుడుచుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంటి బయట చెత్తాచెదారం లేకుండా తుడుచుకుని నీళ్లు జల్లి, ముగ్గు పెట్టుకోవాలని కూడా చెప్తూ ఉంటారు. చాలామంది రకరకాల ముగ్గులను వేస్తూ ఉంటారు. ఎంతో అందంగా ఇంటి గుమ్మాన్ని అలంకరించుకుంటూ ఉంటారు. అయితే, అసలు ముగ్గులు ఎందుకు వేయాలి..? ముగ్గుల అర్థం, పరమార్థం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి గడప ముందు ముగ్గులలో భాగంగా 2 గీతల్ని గీస్తూ ఉంటారు. అయితే, ఇలా గీయడం వలన దుష్టశక్తులు రావట. పైగా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. ముగ్గు వేసి నాలుగు వైపులా కూడా రెండేసి అడ్డగీతలు గీస్తూ ఉంటారు. అలా చేయడం వలన శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయట. పండుగల సమయంలో కచ్చితంగా ఇలా ముగ్గు వేసి, అడ్డగీతలు గీయాలి. ఏ పూజ చేసుకున్నా కూడా ముందు పీట మీద దేవతని పెట్టేటప్పుడు, ముగ్గు వేయాలి.
నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీసుకోవాలి. నక్షత్ర ఆకారంలో వచ్చే గీతాలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలని తొలగిస్తుంది. ఇవేమి మీ దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది. మనం పద్మాన్ని, చుక్కల ముగ్గులు కూడా వేస్తూ ఉంటాము. వాటిలో అనేక కోణాలు ఉంటాయి. అవి గీతలే కాదు. యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర, శాస్త్ర రహస్యలతో కూడి ఉండడం వలన మనకి ఎటువంటి చెడు శక్తులు కలగకుండా, మనకి ఎలాంటి హాని కూడా కలగకుండా అవి చూస్తాయి.
అందుకనే అసలు ముగ్గు ని తొక్కకూడదని చెప్తూ ఉంటారు. తులసి మొక్క దగ్గర అయితే, అష్టదళ పద్మం వేసి, దీపారాధన చేస్తే మంచిది. నూతన వధూవరులు మొదటిసారి భోజనం చేసేటప్పుడు, చుట్టుపక్కల లతలు, పుష్పాలు, తీగలతో ఉన్న ముగ్గులను వేయాలి. ఓం, స్వస్తిక్, శ్రీ వంటి కలిగిన ముగ్గులు వెయ్యద్దు. ఎందుకంటే వాటిని అస్సలు తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలో అమ్మవారు, శ్రీమహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆమెకి ఏడు జన్మల వరకు వైధవ్యం ఉండదు. సుమంగళిగానే చనిపోతుంది అని దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…