Mouna Vratham : చాలా మంది మౌనవ్రతం చేస్తూ ఉంటారు. మౌనవ్రతం ఎందుకు చేయాలి..? మౌనవ్రతం వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా..? అయితే, నిజానికి మౌనవ్రతం ఎందుకు చేస్తారు అనేది చాలామందికి తెలియదు. అసలు మౌన వ్రతం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. మౌనం అంటే, ముని యొక్క వృత్తి. మునులు ఆచరించే విధానం అని అర్థం. మునీశ్వరులు ఎక్కువగా మౌనవ్రతాన్ని పాటించేవారు. కాబట్టి ముని అనే పేరు వచ్చింది.
మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అయితే, వీటన్నింటికీ మౌనాన్ని ఇవ్వడం మౌనవ్రతాన్ని ఆచరించడం అంటే. దశ ఇంద్రియాలు కూడా ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి. అప్పుడే పూర్తిగా మౌనం పాటించడం. నిజమైన మౌన వ్రతం చేసినప్పుడు అందుకే ద్రవాహార పదార్థాలను తీసుకోవాలంటారు. నిష్టగా ఒక్క క్షణం మౌన వ్రతం చేసినా సరే చాలు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా ఇది మనిషికి ఎంతో మేలుని కలిగిస్తుంది.
మౌనవ్రతం చేయడం వలన వాక్ బుద్ది, వాక్ శుద్ధి పెరుగుతాయి. ఆరోగ్యంగా చూసుకున్నట్లయితే, ప్రశాంతంగా ఉండొచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మౌనవ్రతం చేయడం వలన శరీరానికి హీలింగ్ పవర్ పెరుగుతుంది. ఎంతో ఉత్సాహంగా శరీరం పని చేస్తుంది. దీని వలన కోపం తగ్గుతుంది. రోగాలు కూడా కంట్రోల్లో ఉంటాయి.
మనసులో ప్రశాంతత కలుగుతుంది. కొంచెం సేపు పాటించినా, అనవసరమైన గొడవలు ఏమీ ఉండవు. చాలా మటుకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మౌనవ్రతం ఉండడం వలన ఇలా అనేక లాభాలని పొందొచ్చు. ఆరోగ్యాన్ని కూడా మరింత పెంపొందించుకోవచ్చు. అయితే, ఈ రోజుల్లో మౌనవ్రతం అంటే ఏమిటో చాలామందికి తెలియడం లేదు. కానీ ఇన్ని లాభాలని మౌనవ్రతం వలన పొందవచ్చు. కాబట్టి, అప్పుడప్పుడూ పాటించడం మంచిదే. వారానికి ఒక రోజైనా మౌనవ్రతం చేయడం వలన ఈ చక్కటి లాభాలని పొంది, మనం ఎంతో ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించొచ్చు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…