Tirumala : చాలా మంది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళుతూ ఉంటారు. కొంతమంది అయితే ప్రతి ఏటా కూడా తిరుమల వెళుతూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి విదేశీయులు కూడా వస్తారు. అయితే తిరుమల గురించి ఎవరికీ తెలియని బ్రహ్మ రహస్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
శ్రీవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎదురుకుండా గట్టు దగ్గర తీర్థం ఇస్తూ ఉంటారు. అయితే కొందరు అక్కడికి వెళ్లి తీర్థాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ కొందరు వెళ్లకుండా వచ్చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఇచ్చే తీర్ధం స్వయంగా బ్రహ్మ తాకినది. ప్రతిరోజు రాత్రి అర్చకులు అక్కడ నీళ్లు, చందనాన్ని పెట్టి వెళ్ళిపోతారు. బ్రహ్మ అక్కడికి వస్తారు. బ్రహ్మ వలన ఆ తీర్థం తయారవుతుంది.
తిరుమలలో విశ్వక్సేనుడు ఉన్నారు. విశ్వక్సేనుడు ఉన్నారని చాలా మందికి తెలియదు. విమానం వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి ముందుకు వెళితే, అక్కడ విశ్వక్సేనుడు కనపడతారు. తిరుమలలో ఉండే హుండీ కూడా ఎప్పుడూ ఒకే స్థానంలో ఉంటుంది. దానిని మార్చరు. శంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీ చక్రం యొక్క శక్తి హుండీ కింద ఉంది. అందుకే ఎప్పుడూ హుండీ స్థానం మారదు. అలానే వైకుంఠ ద్వారానికి బయట ఒక అమ్మవారు నిలబడి ఉంటారు.
ఆ అమ్మవారి చేతుల నుండి కాసులు కురుస్తున్నట్లు కనపడుతుంది. అమ్మవారిని ఎందుకు అక్కడ పెట్టారంటే, హుండీలో ఎవరు డబ్బులు వేస్తున్నారు అనేది ఆ అమ్మవారు గమనిస్తారు. అందుకే అక్కడ అమ్మవారు ఉంటారు. అలానే హుండీ కింద ఒక చిన్న తొట్టి లాంటిది ఉండి, దానికి గోముఖం కలిగి ఉంటుంది, దానిని తొట్టి తీర్థమని అంటారు. శ్రీవారిని తాకిన జాలం దాని నుండి వస్తాయి. తిరుమలలో రామానుజులు వారి విగ్రహం కూడా ఉంటుంది. తిరుమల పర్వతాన్ని ఆయన మోకాళ్ళతో ఎక్కారు.
రామానుజుల వారి గుడి పక్కన శక్తివంతమైన నారసింహ విగ్రహం ఉంది. దీన్ని కూడా చాలామంది చూడరు. తిరుమలలో అక్కడ ఒక స్తంభం కూడా ఉంటుంది. ఆ స్తంభం ఏంటి ఇక్కడ వుంది అని భక్తులు ఆశ్చర్యపోతారు. కానీ తిరుమల ఆలయాన్ని కట్టినప్పుడు ఆ స్తంభాన్ని మొదట పెట్టారు. సొంత ఇల్లు లేని వాళ్ళు ఆ స్తంభాన్ని కౌగిలించుకుని స్వామివారిని దర్శించుకుంటే, మళ్లీ తిరుమల వచ్చేసరికి సొంత ఇల్లు కట్టుకుంటారని నమ్మకం.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…