Tirumala : చాలా మంది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళుతూ ఉంటారు. కొంతమంది అయితే ప్రతి ఏటా కూడా తిరుమల వెళుతూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి విదేశీయులు కూడా వస్తారు. అయితే తిరుమల గురించి ఎవరికీ తెలియని బ్రహ్మ రహస్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
శ్రీవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎదురుకుండా గట్టు దగ్గర తీర్థం ఇస్తూ ఉంటారు. అయితే కొందరు అక్కడికి వెళ్లి తీర్థాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ కొందరు వెళ్లకుండా వచ్చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఇచ్చే తీర్ధం స్వయంగా బ్రహ్మ తాకినది. ప్రతిరోజు రాత్రి అర్చకులు అక్కడ నీళ్లు, చందనాన్ని పెట్టి వెళ్ళిపోతారు. బ్రహ్మ అక్కడికి వస్తారు. బ్రహ్మ వలన ఆ తీర్థం తయారవుతుంది.
తిరుమలలో విశ్వక్సేనుడు ఉన్నారు. విశ్వక్సేనుడు ఉన్నారని చాలా మందికి తెలియదు. విమానం వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి ముందుకు వెళితే, అక్కడ విశ్వక్సేనుడు కనపడతారు. తిరుమలలో ఉండే హుండీ కూడా ఎప్పుడూ ఒకే స్థానంలో ఉంటుంది. దానిని మార్చరు. శంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీ చక్రం యొక్క శక్తి హుండీ కింద ఉంది. అందుకే ఎప్పుడూ హుండీ స్థానం మారదు. అలానే వైకుంఠ ద్వారానికి బయట ఒక అమ్మవారు నిలబడి ఉంటారు.
ఆ అమ్మవారి చేతుల నుండి కాసులు కురుస్తున్నట్లు కనపడుతుంది. అమ్మవారిని ఎందుకు అక్కడ పెట్టారంటే, హుండీలో ఎవరు డబ్బులు వేస్తున్నారు అనేది ఆ అమ్మవారు గమనిస్తారు. అందుకే అక్కడ అమ్మవారు ఉంటారు. అలానే హుండీ కింద ఒక చిన్న తొట్టి లాంటిది ఉండి, దానికి గోముఖం కలిగి ఉంటుంది, దానిని తొట్టి తీర్థమని అంటారు. శ్రీవారిని తాకిన జాలం దాని నుండి వస్తాయి. తిరుమలలో రామానుజులు వారి విగ్రహం కూడా ఉంటుంది. తిరుమల పర్వతాన్ని ఆయన మోకాళ్ళతో ఎక్కారు.
రామానుజుల వారి గుడి పక్కన శక్తివంతమైన నారసింహ విగ్రహం ఉంది. దీన్ని కూడా చాలామంది చూడరు. తిరుమలలో అక్కడ ఒక స్తంభం కూడా ఉంటుంది. ఆ స్తంభం ఏంటి ఇక్కడ వుంది అని భక్తులు ఆశ్చర్యపోతారు. కానీ తిరుమల ఆలయాన్ని కట్టినప్పుడు ఆ స్తంభాన్ని మొదట పెట్టారు. సొంత ఇల్లు లేని వాళ్ళు ఆ స్తంభాన్ని కౌగిలించుకుని స్వామివారిని దర్శించుకుంటే, మళ్లీ తిరుమల వచ్చేసరికి సొంత ఇల్లు కట్టుకుంటారని నమ్మకం.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…