ఆధ్యాత్మికం

మన పురాణాల ప్రకారం ఈ 8 మంది వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారట..! ఇంతకీ వారెవరో చూడండి..!

మ‌నిషి అన్నాక ఒక‌సారి మ‌ర‌ణిస్తే ఇక అంతే. అత‌ను మ‌ళ్లీ బ‌తికేందుకు అవ‌కాశాలు లేవు. అలాగే ఏ మ‌నిషైనా ఎప్పుడో ఒక‌ప్పుడు, ఏదో ఒక రోజున మ‌ర‌ణించాల్సిందే. అది ఎలాగైనా కావ‌చ్చు. మ‌నిషికి మృత్యువు అనివార్యం. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నిషి అనేక రంగాల్లో అప్ర‌తిహ‌తంగా దూసుకెళ్తున్నాడు కానీ, మృత్యువును జ‌యించ‌గ‌లిగే మందును మాత్రం క‌నిపెట్ట‌లేక‌పోయాడు. కనుక ఎవ‌రైనా త‌మ జీవితంలో ఏదో ఒక సారి మృత్యువు బారిన ప‌డాల్సిందే. అయితే హిందూ పురాణాల ప్ర‌కారం కొంద‌రు మాత్రం ఇప్ప‌టికీ కొన్ని యుగాల నుంచీ బ‌తికే ఉన్నార‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇంతకీ.. వారెవ‌రో మీకు తెలుసా..? అదే చూద్దాం పదండి..!

మూడ‌డుగుల స్థ‌లం కోరి వామ‌నుడి రూపంలో వ‌చ్చిన‌ శ్రీ‌మ‌హావిష్ణువుచే పాతాళ లోకానికి తొక్క‌బ‌డిన బ‌లి చ‌క్ర‌వర్తి తెలుసు క‌దా. అత‌ను ఇప్ప‌టికీ బ‌తికే ఉన్నాడ‌ట‌. ప్ర‌తి ఏటా ఒక రోజున అత‌ను పాతాళ లోకం నుంచి భూమిపైకి వ‌స్తాడ‌ట‌. అదే రోజున కేర‌ళీయులు ఓన‌మ్ పండుగ జ‌రుపుకుంటార‌ట‌. రావ‌ణుడి త‌మ్ముడు విభీష‌ణుడు. ఇత‌ను రాముడికి యుద్దంలో స‌హ‌కరిస్తాడు. దీంతో రాముడు ఇత‌నికి మ‌ర‌ణం లేకుండా మృత్యుంజ‌యునిగా చేస్తాడు. ఈ క్ర‌మంలోనే విభీష‌ణుడు ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడ‌ట‌. ఇత‌నికి చెందిన గుడి ఒక‌టి రాజస్థాన్‌లోని కోటా అనే టౌన్ లో ఉంది. దేశంలో విభీష‌ణుడికి ఉన్న ఏకైక ఆల‌యం ఇదే. ఇక్క‌డే విభీష‌ణుడు ఇప్ప‌టికీ తిరుగుతూ ఉంటాడ‌ట‌.

శ్రీ‌మ‌హావిష్ణువుకు ఉన్న 10 అవ‌తారాల్లో ప‌ర‌శురామావ‌తారం కూడా ఒక‌టి. ఇత‌ను 21 సార్లు విశ్వంలో ఉన్న చ‌క్ర‌వ‌ర్తులంద‌రినీ జ‌యిస్తాడు. ఇందుకోస‌మే విష్ణువు ఇత‌న్ని కాలాల‌కు స‌మన్వ‌య‌క‌ర్త‌గా నియమించిన‌ట్టు చెబుతారు. ఇత‌ను కూడా మృత్యుంజ‌యుడే. ఇప్ప‌టికీ ఇత‌ను జీవించే ఉన్నాడ‌ట‌. మ‌హాభార‌తాన్ని రాసిన వేద వ్యాస మ‌హ‌ర్షి కూడా మృత్యుంజ‌యుడే. ఇత‌నికీ మ‌ర‌ణం లేద‌ట‌. ఇప్ప‌టికీ జీవించే ఉన్నాడ‌ట‌. మ‌హాభారతంలో అశ్వ‌త్థామ‌ది ఒక ముఖ్య‌మైన పాత్ర‌. ఇత‌ను ద్రౌప‌ది కుమారుల‌ను నిద్ర‌లోనే చంపుతాడు. అభిమ‌న్యుడి కుమారుడు ప‌రీక్షిత్తును కూడా త‌ల్లి గ‌ర్భంలో ఉండగానే చంపుతాడు, కానీ కృష్ణుడు అత‌న్ని బ‌తికిస్తాడు. అనంతరం కృష్ణుడు అశ్వ‌త్థామ‌కు శాపం పెడ‌తాడు. అందులో భాగంగానే అశ్వ‌త్థామ ఇప్ప‌టికీ జీవించే ఉన్నాడ‌ట.

కృపాచార్యుడు పాండ‌వులు, కౌర‌వుల‌కు గురువు. ద్రోణుడికి బంధువు. ఇతనికి కూడా మ‌ర‌ణం లేద‌ట‌. చాలా చిన్న వ‌య‌స్సులోనే మ‌ర‌ణం ఉంద‌ని తెలుసుకున్న మార్కండేయుడు శివునికై త‌ప‌స్సు చేసి ఆయ‌న‌చే మ‌హామృత్యుంజ‌య మంత్రం పొందుతాడు. ఈ క్ర‌మంలోనే మార్కండేయుడు మృత్యుంజ‌యుడిగా మారుతాడు. అందుకే ఆయ‌నకు కూడా మ‌ర‌ణం ఉండ‌దు. ఇప్ప‌టికీ బ‌తికే ఉన్నాడ‌ని చెబుతారు. భ‌క్తుల‌ను కాపాడే క‌లియుగ దైవంగా హనుమంతుడు పేరుగాంచాడు. ఈయ‌న కూడా మృత్యుంజ‌యుడే. ఈయ‌న‌కూ మ‌ర‌ణం లేదు, రాదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

దసరా బరిలో ప్రభాస్ ‘ఫౌజీ’? రిలీజ్ డేట్‌పై నెట్టింట క్రేజీ ప్రచారం.. మేకర్స్ ఏమంటున్నారంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…

Saturday, 31 January 2026, 10:37 AM

భారత్‌లోకి REDMI Note 15 Pro సిరీస్: 200MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…

Friday, 30 January 2026, 9:51 PM

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM