Bed : మన పూర్వీకులు ఎన్నో పద్ధతుల్ని పాటించేవారు. వాటిని కూడా ఇంకా చాలా మంది పాటిస్తూనే ఉన్నారు. అయితే, ఒక్కొక్క సారి మనకి ఏదైనా పరిష్కారాన్ని జ్యోతిష్య పండితులు కానీ లేదంటే పెద్దలు కానీ చెప్తూ ఉంటారు. వాటిని ఆచరిస్తే, మంచి జరుగుతుందని శుభం కలుగుతుందని అంటూ ఉంటారు. మన జీవితంలో కష్టం, సుఖం రెండు ఉంటాయి. ఏది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు చెప్పలేము.
అయితే, ఇక్కడ కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వీటిని కనుక పాటించినట్లయితే, కచ్చితంగా ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. కొందరికి కోపం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవడానికి, రాత్రి నిద్ర పోయేటప్పుడు రాగి పాత్రలో నీళ్లు పోసి, మంచం కింద కానీ పక్కన కానీ పెట్టుకోవాలి. అలానే రాత్రిపూట దిండు కింద, ఒక ఎర్రచందనం చెక్కని పెట్టడం వలన కోపం కంట్రోల్ లో ఉంటుంది. కొంత మందికి దృఢ సంకల్పం పెంచుకోవాలని ఉంటుంది.
దృడ సంకల్పం పెరగాలంటే, వెండి పాత్రలు కానీ ఏదైనా చిన్న వెండి గిన్నెలో కానీ నీళ్ళు పోసి మంచం కింద పెట్టుకోవాలి. వెండితో తయారుచేసిన వస్తువులని పెట్టుకుంటే కూడా దృఢ సంకల్పం పెరుగుతుంది. బంగారం కానీ వెండి అభరణాలను కానీ దిండు కింద పెట్టుకుని నిద్రపోతే, జన్మ కుండలిలోని దోష నివారణ అవుతుంది.
దృష్టి దోషాలు తొలగిపోవాలంటే, ఇనుముతో చేసిన పాత్రలో నీళ్లు పోసి, 21 రోజుల పాటు మంచం కింద పెట్టుకుంటే, దృష్టి దోషాలు తొలగిపోతాయి. జాతిరత్నమైన నీలం ని కూడా దిండు కింద పెట్టుకుంటే, చెడు దోష నివారణ జరుగుతుంది. అలానే అదృష్టం కలగాలంటే, వెండితో చేసిన చేపలని దిండు కింద పెట్టుకోవాలి. వెండి పాత్రలో నీళ్లు పోసి అందులో వెండి చేపని పెడితే కూడా చక్కటి ఫలితం కనబడుతుంది. ఇలా మీరు వీటిని కనుక పాటించినట్లయితే, ఈ బాధల నుండి బయటపడి హాయిగా జీవించొచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…