Lord Kubera : కుబేరుడు ధనానికి, సంపదకు, సకల ఐశ్యర్యాలకు అధిపతి. ఆయన్ను పూజిస్తే వాటిని ఇస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవితోపాటు కుబేరుని విగ్రహాలను, చిత్రపటాలను కూడా చాలా మంది పూజిస్తారు. అయితే నిజానికి మీకు తెలుసా..? కుబేరుడు అంతకు ముందు జన్మలో దొంగ అట. అవును, మీరు విన్నది నిజమే. శివపురాణంలో దీని గురించి చెప్పబడింది. గత జన్మలో దొంగగా ఉన్న కుబేరుడు ఆ తరువాతి జన్మలో దేవుడిగా మారడం నిజంగా విచిత్రమే. అందుకు గల అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుబేరుడు పూర్వ జన్మలో చాలా పేద వాడు. అతని పేరు గున్నిధి. ఒకానొక దశలో తినేందుకు తిండి కూడా అతనికి లభించదు. దీంతో అతను దొంగగా మారతాడు. అయితే ఓ సారి ఒక ప్రదేశంలో ఉన్న శివాలయంలో పెద్ద ఎత్తున బంగారు నగలు, రత్నాలు, ఇతర ఆభరణాలు ఉండడాన్ని గున్నిధి చూస్తాడు. దీంతో వెంటనే ఆ నగలను దొంగిలించాలనుకుంటాడు. ఆ క్రమంలోనే అతను ఆలయంలోకి ప్రవేశించగానే అప్పుడే పెద్ద ఎత్తున గాలి వీస్తుంది. దీంతో ఆలయంలో శివలింగం ఎదుట ఉన్న దీపం ఆరిపోతుంది.
దీపం ఆరిపోవడాన్ని గమనించిన గున్నిధి దాన్ని వెలిగించేందుకు యత్నిస్తాడు. అయితే ఎంత వెలిగించినా ఆ దీపం వెలగదు. అలా అతను చాలా సార్లు ప్రయత్నిస్తాడు. ప్రయత్నించినప్పుడల్లా విఫలమవుతూనే ఉంటాడు. దీంతో విసిగిపోయిన గున్నిధి తన చొక్కాను తీసి మంట పెట్టి దాంతో దీపం వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి గాను శివుడు సంతోషించి గున్నిధి ఎదుట ప్రత్యక్షమై అతన్ని గణాల్లో ఒక అధిపతిగా చేస్తాడు. దీంతో అతను తరువాతి జన్మ నుంచి కుబేరుడిగా మారి సంపదకు రక్షకుడిగా ఉంటాడు.
అయితే నిజానికి కుబేరుడి వద్ద ఉండే ధనం ఆయనది కాదు, ఆయన దానికి రక్షణ మాత్రమే కల్పిస్తాడు. అందుకే చాలా వరకు ఆలయాల బయటే కుబేరుని విగ్రహాలు ఉంటాయి. కానీ లోపల అవి ఉండవు. అయినప్పటికీ ఆయన ధనానికి అధిపతి కనుక ఆయన్ను పూజిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయట పడేస్తాడు. ఇక కుబేరుని కథ నుంచి మనం తెలుసుకోవల్సింది ఏమిటంటే.. శివ లింగం ఎదుట ఎవరైనా దీపం పెడితే వారి ఆర్థిక సమస్యలన్నీ పోతాయట. ముఖ్యంగా ఆ పనిని సాయంత్రం పూట చేయాలట. అలా దీపం వెలిగించే క్రమంలో ఓం నమశ్శివాయ అనే మంత్రం జపించాలి. దీంతో సమస్యలు తొలగిపోతాయట.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…