Lord Kubera : కుబేరుడు ధనానికి, సంపదకు, సకల ఐశ్యర్యాలకు అధిపతి. ఆయన్ను పూజిస్తే వాటిని ఇస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవితోపాటు కుబేరుని విగ్రహాలను, చిత్రపటాలను కూడా చాలా మంది పూజిస్తారు. అయితే నిజానికి మీకు తెలుసా..? కుబేరుడు అంతకు ముందు జన్మలో దొంగ అట. అవును, మీరు విన్నది నిజమే. శివపురాణంలో దీని గురించి చెప్పబడింది. గత జన్మలో దొంగగా ఉన్న కుబేరుడు ఆ తరువాతి జన్మలో దేవుడిగా మారడం నిజంగా విచిత్రమే. అందుకు గల అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుబేరుడు పూర్వ జన్మలో చాలా పేద వాడు. అతని పేరు గున్నిధి. ఒకానొక దశలో తినేందుకు తిండి కూడా అతనికి లభించదు. దీంతో అతను దొంగగా మారతాడు. అయితే ఓ సారి ఒక ప్రదేశంలో ఉన్న శివాలయంలో పెద్ద ఎత్తున బంగారు నగలు, రత్నాలు, ఇతర ఆభరణాలు ఉండడాన్ని గున్నిధి చూస్తాడు. దీంతో వెంటనే ఆ నగలను దొంగిలించాలనుకుంటాడు. ఆ క్రమంలోనే అతను ఆలయంలోకి ప్రవేశించగానే అప్పుడే పెద్ద ఎత్తున గాలి వీస్తుంది. దీంతో ఆలయంలో శివలింగం ఎదుట ఉన్న దీపం ఆరిపోతుంది.
దీపం ఆరిపోవడాన్ని గమనించిన గున్నిధి దాన్ని వెలిగించేందుకు యత్నిస్తాడు. అయితే ఎంత వెలిగించినా ఆ దీపం వెలగదు. అలా అతను చాలా సార్లు ప్రయత్నిస్తాడు. ప్రయత్నించినప్పుడల్లా విఫలమవుతూనే ఉంటాడు. దీంతో విసిగిపోయిన గున్నిధి తన చొక్కాను తీసి మంట పెట్టి దాంతో దీపం వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి గాను శివుడు సంతోషించి గున్నిధి ఎదుట ప్రత్యక్షమై అతన్ని గణాల్లో ఒక అధిపతిగా చేస్తాడు. దీంతో అతను తరువాతి జన్మ నుంచి కుబేరుడిగా మారి సంపదకు రక్షకుడిగా ఉంటాడు.
అయితే నిజానికి కుబేరుడి వద్ద ఉండే ధనం ఆయనది కాదు, ఆయన దానికి రక్షణ మాత్రమే కల్పిస్తాడు. అందుకే చాలా వరకు ఆలయాల బయటే కుబేరుని విగ్రహాలు ఉంటాయి. కానీ లోపల అవి ఉండవు. అయినప్పటికీ ఆయన ధనానికి అధిపతి కనుక ఆయన్ను పూజిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయట పడేస్తాడు. ఇక కుబేరుని కథ నుంచి మనం తెలుసుకోవల్సింది ఏమిటంటే.. శివ లింగం ఎదుట ఎవరైనా దీపం పెడితే వారి ఆర్థిక సమస్యలన్నీ పోతాయట. ముఖ్యంగా ఆ పనిని సాయంత్రం పూట చేయాలట. అలా దీపం వెలిగించే క్రమంలో ఓం నమశ్శివాయ అనే మంత్రం జపించాలి. దీంతో సమస్యలు తొలగిపోతాయట.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…