Lord Ganesha : వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మొట్టమొదట మనం ఏ దేవుడిని పూజించాలన్నా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత మిగిలిన దేవుళ్ళని పూజిస్తూ ఉంటాము. వినాయకుడు అడ్డంకులని తొలగిస్తాడు. వినాయకుడు మనం చేసే పనిలో ఏ ఆటంకాలు లేకుండా మన పనులు చక్కగా అయిపోయేటట్టు చూస్తాడు. అయితే వినాయకుడిని పూజించేటప్పుడు మీరు ఈ పూలతో పూజిస్తే వినాయకుడి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. శ్రేయస్సు కలుగుతుంది.
వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ పండ్లు, పూలని పెట్టడం మంచిదే. మందారం పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఎర్రటి పువ్వులు ఏమున్నా వినాయకుడికి పెట్టండి. వినాయకుడికి ఎర్రని పూలతో పూజ చేస్తే చాలా ఇష్టం. వినాయకుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. పారిజాతం పూలతో కూడా వినాయకుడిని ఆరాధించండి. పారిజాతాలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. గరిక కూడా వినాయకుడికి చాలా ఇష్టం. కచ్చితంగా వినాయకుడి పూజలో గరికని ఉపయోగించండి. గరికతో వినాయకుడిని ఆరాధిస్తే కచ్చితంగా వినాయకుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు.
జిల్లేడు పూలు అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం. ఆయనకి కచ్చితంగా జిల్లేడు పూలను కూడా పెడుతూ ఉండండి. కదంబ పుష్పాలు అంటే కూడా ఎంతో ప్రీతి. కదంబ పుష్పాలతో పూజ చేస్తే కచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. మల్లెపూలు కూడా వినాయకుడికి పెట్టొచ్చు. వైవాహిక జీవితంలో ప్రశాంతత కలగాలంటే మల్లెపూలతో వినాయకుడిని ఆరాధించండి.
ఇక పండ్ల విషయానికి వస్తే వినాయకుడికి ప్రీతికరమైనవి అరటి పండ్లు, జామ పండ్లు. ఈ రెండు పండ్లను మీరు నైవేద్యంగా పెట్టండి. అలాగే దానిమ్మ పండ్లు, మామిడి పండ్లు అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం. వీటిని కూడా మీరు నైవేద్యంగా పెట్టండి. చెరుకు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. చెరుకుని కూడా మీరు పెట్టొచ్చు. అలాగే సీతాఫలం, యాపిల్ పండ్లు, ఆరెంజ్, పైనాపిల్, అంజీర్, ద్రాక్ష, నేరేడు పండ్లను కూడా మీరు వినాయకుడికి నైవేద్యంగా పెట్టొచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…