ఆధ్యాత్మికం

Kiradu Temple : ఈ దేవాలయంలోకి సూర్యాస్తమయం తరువాత వెళ్తే అంతే.. రాళ్లుగా మారిపోతారు..

Kiradu Temple : అసలు ఈ ప్రపంచమే ఓ పెద్ద వింత. దీంట్లో మనకు తెలియని, తెలిసిన వింతలు, విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని కొంత కాలం పాటు వింతలుగా ఉన్నా కాలానుగుణంగా అవి ఆ స్థాయిని కోల్పోతాయి. కానీ కొన్ని వింతలు మాత్రం ఎల్లప్పుడూ రహస్యంగానే ఉంటాయి. అలాగే కొనసాగుతాయి. ఎన్నేళ్లయినా వాటిలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే వాటి గురించి ఎప్పటికప్పుడు కొత్తవారు తెలుసుకుంటూనే ఉంటారు. కాగా రాజస్థాన్‌లోని ఓ దేవాలయం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇందులో వింత, రహస్యం ఏముంది అంటారా..? అక్కడికే వస్తున్నాం.

ముట్టుకోగానే రాయిలా మారిపోయేలా చూపించే సినిమాలను మనం గతంలో చూశాం కదా. ఆ..! అవును..! ఈ దేవాలయం కూడా అలాంటిదే. కాకపోతే ఇందులో సూర్యాస్తమయం తరువాత ఉండకూడద‌ట‌. ఉంటే ఇక అంతే సంగతుల‌ట‌..! వారు తెల్లారేసరికి రాయిలా మారిపోతారట. గత ఎన్నో ఏళ్లుగా ఈ మిస్టరీ ఆ దేవాలయంలో దాగి ఉంది. అసలు దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని బద్మెర్ జిల్లాలో కిరడు అనే పేరిట ఓ దేవాలయం ఉంది. ఇందులో దాగి ఉన్న రహస్యం పట్ల ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది. సూర్యాస్తమయం దాటిన తరువాత ఈ దేవాలయంలో ఎవరైనా ఉంటే వారు తెల్లవారేసరికి రాళ్లలా మారిపోతారట.

Kiradu Temple

కొన్ని వేల ఏళ్ల కిందట ఓ రుషి తన విద్యార్థులతో కలిసి ఈ కిరడు దేవాలయానికి వచ్చాడట. అయితే ఆ రుషి తన విద్యార్థులను దేవాలయం సమీపంలో వదలి స్థానికంగా ఉన్న ఓ ప్రాంతాన్ని చూసేందుకు బయటికి వెళ్లాడట. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలు ఎవరూ ఆ విద్యార్థులకు సహాయం చేయలేదట. కొన్ని రోజుల తరువాత ఆ రుషి తిరిగి వచ్చాడు. కాగా అప్పటికే ఆ విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో వారిని చూసిన ఆ రుషి జరిగిన విషయం తెలుసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన రుషి రాయి లాంటి హృదయం కలిగిన స్థానికులను రాళ్లుగా మారమని శపించాడు.

కాగా ఆ గ్రామంలో కేవలం ఒకే ఒక్క మహిళ ఆ విద్యార్థులకు సహాయం చేసింది. ఆ రుషి ఈ విషయం కూడా తెలుసుకున్నాడు. దీంతో ఆమెకు శాపం వర్తించకుండా చేశాడు. అయితే ఆమెను వెనక్కి తిరిగి చూడకుండా పోవాలని ఆదేశించాడు. కానీ ఆ మహిళ వెళ్లే క్రమంలో వెనక్కి తిరిగి చూసింది. దీంతో ఆమె కూడా రాయిగా మారిపోయింది. అయితే అలా రాయిగా మారిన మహిళ విగ్రహం ఇప్పటికీ ఆ గ్రామంలో అలాగే ఉందట. ఆ విగ్రహం దేవాలయానికి కొంత సమీపంలో ఉంటుంది. కాలానుగుణంగా ఆ శాపం కాస్తా దేవాలయానికే పరిమితమైందని చెబుతారు. అందుకే ఆ దేవాలయంలో సూర్యాస్తమయం తరువాత ఉన్న వారు రాళ్లుగా మారుతారట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

దసరా బరిలో ప్రభాస్ ‘ఫౌజీ’? రిలీజ్ డేట్‌పై నెట్టింట క్రేజీ ప్రచారం.. మేకర్స్ ఏమంటున్నారంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…

Saturday, 31 January 2026, 10:37 AM

భారత్‌లోకి REDMI Note 15 Pro సిరీస్: 200MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…

Friday, 30 January 2026, 9:51 PM

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM