శ్రావణమాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు ఒక ఆలయంగా మారుతుంది. ప్రతి ఇంటిలోనూ పండగ వాతావరణం నెలకొంటుంది. వివిధ రకాల నోములు, వ్రతాలతో మహిళలు ఎంతో బిజీగా ఉంటారు. అదే విధంగా ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ కూడా వస్తుంది. ఈ రాఖీ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. మరి రాఖీ కట్టేటప్పుడు ఏ సమయంలో కట్టాలి, రాఖీ కట్టే సమయంలో ఏ వస్తువులు తప్పకుండా ఉండాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా.
అన్నాచెల్లెళ్ల బంధానికి ఎంతో ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ రోజు సోదరి తన సోదరుడికి ఎప్పుడూ కూడా యమగండం, రాహుకాలంలో రాఖీ కట్టకూడదు. శుభ ముహూర్తంలోనే రాఖీ కట్టాలి. అదేవిధంగా రాఖీ కట్టడం కోసం మనం కొన్ని రకాల వస్తువులను సిద్ధం చేసుకుంటాం. ముఖ్యంగా రాఖీ కట్టే సమయంలో ఎలాంటి వస్తువులు ఉండాలి అనే విషయానికి వస్తే..
సోదరుడికి రాఖీ కట్టే సమయంలో తప్పనిసరిగా కుంకుమ ఉండాలి. కుంకుమ దీర్ఘాయుష్షుకు అదృష్టానికి ప్రతీక. అదేవిధంగా అక్షింతలు. అక్షతం అంటే పరాజయం లేనిది అని అర్థం. అందుకోసమే అక్షింతలు సోదరుడిపై వేయడం వల్ల అతని జీవితంలో ఎలాంటి పరాజయం లేకుండా విజయాలతో దూసుకుపోతాడని అర్థం. కొబ్బరికాయను శ్రీ ఫలం అని కూడా పిలుస్తాం. రాఖీ కట్టే సమయంలో సోదరుడికి కొబ్బరికాయ ఇస్తారు. ఇది అతడి అభివృద్ధికి సూచిక. అదేవిధంగా మిఠాయిలు కూడా తప్పనిసరిగా ఉండాలి. రాఖీ కట్టే సమయంలో సోదరి తన సోదరుడికి మిఠాయి తినిపించడం వల్ల వారిద్దరి మధ్య సంబంధం ఎలాంటి కలహాలు లేకుండా తియ్యగా ఉంటుందని చెబుతారు. కనుక రాఖీ కట్టే సమయంలో తప్పనిసరిగా ఈ వస్తువులు ఉండాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…