Money : భవిష్యత్తులో అంతా మంచి జరగాలని అందరూ కోరుకుంటారు. ఏ సమస్యలు రాకుండా హాయిగా జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఆర్థిక సమస్యలతో కూడా చాలామంది సతమతమవుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీదేవి ఇంట కొలువై ఉండాలంటే ఇలా చేయండి. మీ ఇంట్లో కనుక ఇలా చేసినట్లయితే కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఆర్థిక బాధలే ఉండవు. ధనవంతులు అయిపోవచ్చు.
ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కొచ్చు. సంపద లేకపోతే సంతోషం ఉండదు. సంతోషం లేకపోతే ఆరోగ్యంతోపాటుగా ఎన్నో నష్టాలు కలుగుతాయి. సంపద ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది. అయితే మీ ఇంట్లో సంపద చేకూరాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవితోపాటుగా విష్ణుమూర్తిని కూడా నిత్యం కొలుస్తూ ఉండాలి.
అప్పుడు లక్ష్మీదేవికి ఇంకా ప్రీతి కలిగి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఎక్కడైతే నిత్యం విష్ణు నామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. పైగా ఆ ఇంట సంపదలకి లోటే ఉండదట. ఎల్లో కౌరీస్ అనే గవ్వలని తెచ్చుకోండి. వాటిని ఒక 7 తీసుకుని, జేబులో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఆర్థికంగా నష్టాలు ఏమీ ఉండవు. అలానే, గోమతి చక్రాలని కూడా మీ దగ్గర ఉంచుకుంటే ఆర్థిక లాభం కలుగుతుంది. శత్రువుల బాధ నుండి బయటపడొచ్చు.
తామర పువ్వు విత్తనాలను పెట్టుకుంటే కూడా ఖర్చులు తగ్గుతాయి. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. శనివారం రావి చెట్టు ఆకుని తీసుకుని, నీటితో శుభ్రంగా కడిగి ఆకు మీద హ్రీమ్ రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. లక్ష్మీదేవికి బియ్యంతో పూజ చేసి, అందులో కొంత బియ్యాన్ని మీ దగ్గర పెట్టుకుంటే కూడా ఆర్థిక సమస్యల నుండి తొలగిపోవచ్చు. శ్రీ యంత్రాన్ని ఎప్పుడూ మీ దగ్గర పెట్టుకుంటే కూడా డబ్బుకి లోటు ఉండదు. ఇలా ఆర్థిక సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…