Feeding To Cow : గోమాతని దైవంగా భావించి మనం పూజలు చేస్తూ ఉంటాము. సిటీలలో గోమాతని పూజించడం చాలా తక్కువగా ఉంటోంది. కానీ పల్లెటూర్లలో మాత్రం ప్రతిరోజూ గోమాతని పూజిస్తూ ఉంటారు. ప్రత్యేకించి గోవుని ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల గోశాలలు కూడా ఉంటున్నాయి. అక్కడకి కూడా వెళ్లి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. ఆవులకి ఆహార పదార్థాలు పెడుతూ ఉంటారు. గోవు నుండి వచ్చే ప్రతిదీ కూడా మానవులకి ఉపయోగపడే విధంగా ఉంటుంది.
గోవులో సకల దేవతలు ఉంటారు. ఆవుని పూజించినట్లయితే సమస్త దేవతలందరినీ కూడా పూజించినట్లే. ఆవులకి గడ్డి ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఎప్పుడూ గడ్డి మాత్రమే కాకుండా బెల్లంతో చేసిన వంటకాలను, బియ్యంతో చేసిన వంటకాలను కూడా గోమాతకి పెడితే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. వృత్తిలో నిలకడ ఉండాలంటే కచ్చితంగా గోమాతకి నానబెట్టిన ఉలవలు పెట్టండి.
ఆహారం కింద గోమాతకి నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ ఉంటుంది. ధనాభివృద్ధి కోసం నానబెట్టిన బొబ్బర్లని ఆహారంగా గోమాతకి పెట్టండి. గోధుమలు నానబెట్టి పెడితే కూడా చాలా మంచి జరుగుతుంది. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. శనగలను నానబెట్టి గోమాతకి ఆహారం కింద పెడితే ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది.
బియ్యం పిండి, బెల్లం కొంచెం నీటితో కలిపి గోమాతకి ఆహారం కింద పెడితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కనుక మానసిక ప్రశాంతతను పొందాలంటే ఇలా ఆహారాన్ని గోమాతకి పెట్టండి, రాగి పిండిలో బెల్లం వేసి, కొంచెం నీళ్లు పోసి గోమాతకు పెడితే దరిద్రం పోతుంది. నానబెట్టిన పెసలు కూడా గోమాతకి పెట్టొచ్చు. అప్పుడు విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉడికించిన బంగాళదుంపల్ని గోమాతకు పెడితే నర ఘోష పోతుంది. మనం భోజనం చేసేటప్పుడు మొదట గోమాతకి పెట్టి లేదంటే కుక్కకి పెట్టి మనం తీసుకుంటే ఎన్నో చక్కటి ప్రయోజనాలు ఉంటాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…