Items : మనిషికి దాన గుణం ఉండాలని పెద్దలు చెబుతారు. ధనం, ఆహారం, దుస్తులు.. ఇలా వస్తువులు ఏవైనా దానం చేస్తే దాంతో ఎంతో పుణ్యం వస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కేవలం హిందూ మతంలోనే కాదు, ఏ మతమైనా ప్రతి మనిషి దాన గుణాన్ని, ఇతరుల పట్ల జాలిని, కరుణను, మానవతను కలిగి ఉండాలనే చెబుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది తమకు తోచినంతలో దానం చేస్తుంటారు. అయితే మీకు తెలుసా..? ఏ వస్తువునైనా దానం చేయవచ్చు కానీ, ఇప్పుడు మేం చెప్పబోయే వస్తువులను మాత్రం అస్సలు ఎవరూ, ఎప్పటికీ దానం చేయవద్దట. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కత్తులు, సూదులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఎవరూ దానం చేయరాదు. అలా చేసిన వారిని దురదృష్టం వెంటాడుతుందట. ఏది చేసినా అస్సలు కలసి రాదట. దీనికి తోడు దంపతుల మధ్య కలహాలు వస్తాయట. అస్సలు మంచి జరగదట. పాడైపోయిన ఆహారం దానం ఇవ్వరాదు. అలా ఇచ్చిన వారు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఉన్న డబ్బు అంతా పోగొట్టుకుంటారట. డబ్బు వచ్చినా అస్సలు నిలవదట.
పగిలిపోయిన వస్తువులు, చిరిగిన దుస్తులను ఎవరికీ దానం ఇవ్వరాదు. అలా చేస్తే అదృష్టం కలసి రాదట. ఏం చేసినా చెడే జరుగుతుందట. అసలు అలాంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదట. వెంటనే పారేయాలట. చీపురును ఇతరులకు దానం చేయరాదు. ఇవ్వరాదు. అలా ఇచ్చిన వారి ఇంట్లో లక్ష్మి నిలవదట. డబ్బు ఇట్టే ఖర్చవుతుందట. వచ్చినా అస్సలు నిలవదట. ప్లాస్టిక్ వస్తువులను దానం ఇవ్వరాదు. ఇతరులకు కూడా బదులుగా వాడుకునేందుకు ఇవ్వరాదు. అలా ఇచ్చిన వారికి మంచి జరగదట. కెరీర్ పరంగా అన్నీ సమస్యలే ఎదురవుతాయట. కనుక ఈ వస్తువులను ఎవరూ దానం చేయకుండా ఉంటే మంచిది. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…