Dishti Remedy : పురాతన కాలం నుంచి మన పెద్దలు, మనం నమ్ముతూ వస్తున్న ఆచారాల్లో దిష్టి కూడా ఒకటి. దీన్నే దృష్టి అని కూడా అంటారు. నరుడి దిష్టికి నాపరాళ్లు కూడా పగులుతాయి అనే సామెతను మీరు వినే ఉంటారు. అంటే నరుడి చూపు వల్ల కలిగే ప్రభావానికి పెద్ద రాయి కూడా పగులుతుందని అర్థం. అందుకే ఆ మాట చెబుతారు. అయితే ఈ కాలంలో కూడా దిష్టిని నమ్ముతున్నారా ? అంటే.. అవును, దాన్ని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారి కోసమే కింద ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. దీంతో నర దిష్టి నుంచి ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!
నర దిష్టి నుంచి తప్పించుకునేందుకు ఒక సులభమైన మార్గం ఉంది. అదే గణపతి గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని రోజులో ఒకేసారి జపించాలి. జపించినప్పుడు 108 సార్లు పూర్తి చేయాలి. దీంతో దిష్టి ప్రభావం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. మరి ఆ మంత్రం ఏమిటంటే..
“ఓం తత్పురుషాయ విఘ్నహే.. వక్రతుండాయ ధీమహి.. తన్నోన్ గణపతి ప్రచోదయాత్..”
పైన చెప్పిన మంత్రాన్ని రోజులో 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే దిష్టి నుంచి తప్పించుకోవచ్చు. ఇక ఈ మంత్రంతోపాటు కనుదిష్టి యంత్రాన్ని ఇళ్లలో, దుకాణాల్లో, కార్యాలయాల్లోని గోడపై ఉత్తర దిశ చూసే విధంగా ఉంచుకోవాలి. పూజ గదిలో కానీ, ఇంటికి వచ్చే వారి దృష్టి ఆకర్షించే విధంగా ముఖ ద్వారంపైగానీ అలంకరించుకోవచ్చు. ఈ యంత్రానికి ప్రతి అమావాస్య, పౌర్ణమిలకు దిష్టి తీసి దీన్ని పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కనుక పైన చెప్పిన మంత్రం, తరువాత చెప్పిన సూచనలతో ఎవరైనా దిష్టి బారిన పడకుండా ఉండవచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…