Mantram : ఇదివరకు రోజుల్లో కేవలం మంత్రాలు వంటి వాటిని చదువుకునేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. టెక్నాలజీ పెరగడంతో స్మార్ట్ ఫోన్ కి బాగా ప్రతి ఒక్కరు అలవాటు పడిపోయారు. పైగా రింగ్ టోన్స్ కింద మంత్రాలని కూడా పెట్టుకుంటున్నారు. మంత్రం మన మనసు పొరల్లో ఉండే పలు రకాల ఆలోచనల్ని దూరం చేస్తుంది. మహాశక్తివంతమైన మంత్రాలని మన ఋషులు అమోఘ తపశక్తితో భగవద్ ఆవేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. ఎన్నో శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి.
ఇష్టదేవతలని ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం. అయితే పవిత్రమైన మంత్రాలని సెల్ఫోన్ రింగ్ టోన్స్ కింద పెట్టుకోవచ్చా..? పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మంత్రం అనేది ఒక శాసనం. పరమాత్మ సాక్షాత్కారానికి ఆయుధం. ఏ మంత్రం అయినా సరే గురు ఉపదేశం లేనిదే ఫలించదు. మంత్రాలని పురాణాల్లో చెప్పిన విధంగా పాటించాలి.
మంత్రాలని రింగ్ టోన్స్ కింద పెట్టుకోవడం మంచిది కాదు. మహా పాపం. మంత్ర ఉచ్చారణకి కఠోరమైన నియమాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది రింగ్ టోన్స్ కింద గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వంటివి పెట్టుకుంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల మన ఫలితం పొందడం మాట ఎలా ఉన్నా, మనల్ని అవి పతనం వైపుకు తీసుకెళ్తాయి. మంత్రాలు ఎప్పుడూ పాటలు కాదు. మననం చేయాల్సినది మంత్రం.
మూల మంత్రాలని గురూపదేశం ద్వారా పొందినా మనసులో చేయాలి. మంత్రాలు ఏమీ భజనలు పాటలు కావు. అయితే అలా రింగ్ టోన్స్ కింద పెట్టుకోవాలనుకునే వాళ్ళు అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వంటివి పెట్టుకోవచ్చు. వాటిని హాయిగా పాడుకోవచ్చు.
కానీ మంత్రాలని అలా పెట్టుకోకూడదు. రింగ్ టోన్స్ కింద పెట్టుకోవడానికి చాలానే ఉన్నాయి. మనం మంత్రాలనే పెట్టుకోవాల్సిన పనిలేదు. మంత్ర ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చెయ్యాలి. ఉపదేశం లేని వాళ్ళు ప్రణవ సంహితంగా చేయరాదని శాస్త్రాలు అంటున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…