Mantram : ఇదివరకు రోజుల్లో కేవలం మంత్రాలు వంటి వాటిని చదువుకునేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. టెక్నాలజీ పెరగడంతో స్మార్ట్ ఫోన్ కి బాగా ప్రతి ఒక్కరు అలవాటు పడిపోయారు. పైగా రింగ్ టోన్స్ కింద మంత్రాలని కూడా పెట్టుకుంటున్నారు. మంత్రం మన మనసు పొరల్లో ఉండే పలు రకాల ఆలోచనల్ని దూరం చేస్తుంది. మహాశక్తివంతమైన మంత్రాలని మన ఋషులు అమోఘ తపశక్తితో భగవద్ ఆవేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. ఎన్నో శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి.
ఇష్టదేవతలని ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం. అయితే పవిత్రమైన మంత్రాలని సెల్ఫోన్ రింగ్ టోన్స్ కింద పెట్టుకోవచ్చా..? పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మంత్రం అనేది ఒక శాసనం. పరమాత్మ సాక్షాత్కారానికి ఆయుధం. ఏ మంత్రం అయినా సరే గురు ఉపదేశం లేనిదే ఫలించదు. మంత్రాలని పురాణాల్లో చెప్పిన విధంగా పాటించాలి.
మంత్రాలని రింగ్ టోన్స్ కింద పెట్టుకోవడం మంచిది కాదు. మహా పాపం. మంత్ర ఉచ్చారణకి కఠోరమైన నియమాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది రింగ్ టోన్స్ కింద గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వంటివి పెట్టుకుంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల మన ఫలితం పొందడం మాట ఎలా ఉన్నా, మనల్ని అవి పతనం వైపుకు తీసుకెళ్తాయి. మంత్రాలు ఎప్పుడూ పాటలు కాదు. మననం చేయాల్సినది మంత్రం.
మూల మంత్రాలని గురూపదేశం ద్వారా పొందినా మనసులో చేయాలి. మంత్రాలు ఏమీ భజనలు పాటలు కావు. అయితే అలా రింగ్ టోన్స్ కింద పెట్టుకోవాలనుకునే వాళ్ళు అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వంటివి పెట్టుకోవచ్చు. వాటిని హాయిగా పాడుకోవచ్చు.
కానీ మంత్రాలని అలా పెట్టుకోకూడదు. రింగ్ టోన్స్ కింద పెట్టుకోవడానికి చాలానే ఉన్నాయి. మనం మంత్రాలనే పెట్టుకోవాల్సిన పనిలేదు. మంత్ర ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చెయ్యాలి. ఉపదేశం లేని వాళ్ళు ప్రణవ సంహితంగా చేయరాదని శాస్త్రాలు అంటున్నాయి.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…