కేరళలోని గత రెండు రోజుల క్రితం వరకట్న వేధింపులకు బలైన యువతి విస్మయ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోజురోజుకు ఈ కేసు తీవ్ర మలుపులు తిరుగుతోంది. విస్మయ అత్తింటివారు తనని అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని కారణంగా ఆత్మహత్య చేసుకుందని అందరూ ముందుగా భావించినప్పటికీ, అది ఇది ఆత్మహత్య కాదు హత్య అని తాజాగా హత్య కేసుకు సంబంధించిన పలు విషయాలు బయటపడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళలోని కొల్లాం జిల్లా సస్తంకొట్ట ప్రాంతానికి చెందిన ఎస్ కిరణ్ కుమార్కు, విస్మయ వి నాయర్(23) అనే యువతికి మార్చి 2020లో పెద్దల సమక్షంలో వివాహమైంది. అల్లుడు ఆర్టీఏలోపని చేస్తుండడంతో తనకు గొప్ప సంబంధం వచ్చింది అని భావించిన తండ్రి తనకు కట్నకానుకలు పెద్ద ఎత్తున ఒక చెప్పాడు. కూతురి కోసం ఒక ఎకరా పొలం, ఒక కారు, వంద తులాల బంగారాన్ని ఇచ్చి కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన విస్మయకు అత్తారింట్లో తీవ్ర వేధింపులు ఎదురయ్యాయి.తన భర్త కిరణ్ తనకు కారు కాకుండా డబ్బులు కావాలని, విస్మయను వేధించేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి పుట్టింటికి వెళ్ళిన విస్మయ పై కిరణ్ చేయి చేసుకోవడంతో వారిరువురి మధ్య గొడవలు జరిగి తన కూతురిని తన ఇంటిలోనే ఉంచుకున్నాడు. అయితే కొద్ది రోజుల తర్వాత విస్మయ పరీక్షల నిమిత్తం హాస్టల్ కి వెళ్లగా అక్కడి నుంచి భర్త కిరణ్ ని బలవంతంగా వారి ఇంటికి తీసుకెళ్లాడు.
అత్తారింటికి వెళ్ళిన విస్మయ చిత్రహింసలు ఎక్కువయ్యాయి. కేవలం తన తల్లితో మాత్రమే మాట్లాడేదని అక్కడ తనకి ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు తమతో చెప్పకుండా కేవలం అమ్మతో మాత్రమే చెప్పేదని విస్మయ సోదరుడు తెలిపాడు.జూన్ 19న తన కజిన్కు భర్త ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడో చెబుతూ మెసేజ్ చేసింది. తనని కొట్టడంతో తన మొహం పై గాయాలయ్యాయని,ఆ ఫోటోలను తన అన్నకు వాట్సప్ చేసి ఎవరికీ చొప్పదంటు మెసేజ్ చేసినట్టు తెలిపాడు.
ఈ ఘటన జరిగిన రెండు రోజులకే విస్మయ ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిందని తనని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చామని కిరణ్ తనకు ఫోన్ చేశారని విస్మయ సోదరుడు తెలిపారు. ఇది ఆత్మహత్య కాదు హత్య అని, అదనపు కట్నం కోసమే విస్మయను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని, వారికి సరైన శిక్ష వేయాలని విస్మయ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విస్మయ హత్య కేసులో నిజాలు బయటపడటంతో కేరళ మొత్తం నిందితులకు శిక్ష పడాలని పెద్ద ఎత్తున మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…