రోజురోజుకు మనం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉండగా కొందరు మాత్రం ఇంకా మూర్ఖంగానే ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో కూడా ఎంతో మంది తల్లిదండ్రులు లింగ వివక్ష చూపుతున్నారు. తమకు మగ బిడ్డ కావాలనే ఉద్దేశంతో ఆడబిడ్డను పొత్తిళ్ళలోనే చిదిమేస్తున్నారు.తాజాగా మూడోసారి కూడా బిడ్డ పుట్టిందన్న ఉద్దేశంతో కన్నతల్లి ఆ ఆడబిడ్డ పట్ల కసాయి తల్లిగా మారిపోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
నామక్కల్ జిల్లా ఎరుంపట్టికి చెందిన చిన్నతంబి కుమారుడు సూర్య, కస్తూరి దంపతులకు ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కొడుకు కోసం మూడవసారి గర్భం దాల్చిన కస్తూరినీ ప్రసవం కోసం
నామక్కల్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలోనే కస్తూరి ఆస్పత్రిలో ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది.
ఈ విధంగా కస్తూరి ఎవరికీ తెలియకుండా వెళ్లిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కస్తూరి ఈనెల 13వ తేదీన తన కూతురు మృతిచెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులకు అనుమానం రావడంతో ఆ చిన్నారిని తీసి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె హత్య చేయబడినట్లు నిర్ధారణ జరిగింది. ఈ మేరకు పోలీసులు కస్తూరిని గట్టిగా విచారించగా.. మూడవ సారి కూడా ఆడపిల్ల పుట్టడంతో ఏమాత్రం జాలి దయ లేకుండా, కన్న మమకారం కూడా లేకుండా తానే స్వయంగా బిడ్డను చంపినట్లు ఒప్పుకుంది. దీంతో శుక్రవారం పోలీసులు కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…