అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంతో జీవితాంతం తన భార్యకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భర్త ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కేవలం తనకు విడాకులు ఇచ్చిందన్న కారణంతో తన పై పగ పెంచుకుని సదరు మహిళ పట్ల అత్యంత కిరాతకంగా, ప్రవర్తించిన చంపిన ఘటన అహ్మదాబాద్లోని వత్వా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
అజయ్ ఠాకూర్ అనే వ్యక్తి హేమ అనే మహిళను గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులపాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. అప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో ఎంతో విసుగుచెందిన హేమ తనని దూరం పెడుతూ తనతో స్నేహం చేస్తున్నటువంటి మహేష్ ఠాకూర్ అనే వ్యక్తికి దగ్గరయింది.ఈ క్రమంలోనే తన భర్తకు విడాకులు ఇచ్చి తన ఇద్దరు పిల్లలను అజయ్ దగ్గరే వదిలి మహేష్ ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
ఈ విధంగా ఇద్దరు పిల్లలను తన వద్ద వదలడంతో వారి సంరక్షణ ఎలా చేపట్టాలో తెలియని మహేష్ ఎంతో మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసై తన భార్య హేమ పై విపరీతమైన పగ పెంచుకున్నాడు.ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి హేమని చంపాలని ప్రణాళిక వేసుకున్న అజయ్ ఇంట్లో మహేష్ లేని సమయం చూసి తనపై కత్తితో దాడి చేశాడు.అతని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన హేమకు సాధ్యం కాలేకపోయింది. ఈ క్రమంలోనే అజయ్ హేమను అతి కిరాతకంగా కత్తితో 27 సార్లు పొడిచి పొడిచి చంపాడు.మహేష్ తిరిగి ఇంటికి వచ్చేసరికి హేమ రక్తపు మడుగులో మృతి చెంది ఉండటం చూసి తన మొదటి భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…