అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంతో జీవితాంతం తన భార్యకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భర్త ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కేవలం తనకు విడాకులు ఇచ్చిందన్న కారణంతో తన పై పగ పెంచుకుని సదరు మహిళ పట్ల అత్యంత కిరాతకంగా, ప్రవర్తించిన చంపిన ఘటన అహ్మదాబాద్లోని వత్వా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
అజయ్ ఠాకూర్ అనే వ్యక్తి హేమ అనే మహిళను గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులపాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. అప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో ఎంతో విసుగుచెందిన హేమ తనని దూరం పెడుతూ తనతో స్నేహం చేస్తున్నటువంటి మహేష్ ఠాకూర్ అనే వ్యక్తికి దగ్గరయింది.ఈ క్రమంలోనే తన భర్తకు విడాకులు ఇచ్చి తన ఇద్దరు పిల్లలను అజయ్ దగ్గరే వదిలి మహేష్ ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
ఈ విధంగా ఇద్దరు పిల్లలను తన వద్ద వదలడంతో వారి సంరక్షణ ఎలా చేపట్టాలో తెలియని మహేష్ ఎంతో మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసై తన భార్య హేమ పై విపరీతమైన పగ పెంచుకున్నాడు.ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి హేమని చంపాలని ప్రణాళిక వేసుకున్న అజయ్ ఇంట్లో మహేష్ లేని సమయం చూసి తనపై కత్తితో దాడి చేశాడు.అతని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన హేమకు సాధ్యం కాలేకపోయింది. ఈ క్రమంలోనే అజయ్ హేమను అతి కిరాతకంగా కత్తితో 27 సార్లు పొడిచి పొడిచి చంపాడు.మహేష్ తిరిగి ఇంటికి వచ్చేసరికి హేమ రక్తపు మడుగులో మృతి చెంది ఉండటం చూసి తన మొదటి భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం యుఫోరియా గ్రాండ్ రిలీజ్ ప్రెస్మీట్లో నటి భూమిక చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని…
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…