రంగుల పంచమితో ముగిసే హోలీ వేడుకలు..!

April 2, 2021 4:45 PM

భారతదేశంలో జరుపుకునే ఎన్నో పండుగలలో హోలీ పండుగ ఒకటి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. కాగా నేడు రంగుల పంచమి కావడంతో హోలీ పండుగను ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలలో హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ రంగ్ పంచమి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పంచమి తిథి రోజు వస్తుంది.

మన హిందూ పురాణాల ప్రకారం ఈ పంచమి తిథి రోజుతో హోలీ పండుగ ముగుస్తుంది. పేరులో ఉన్న విధంగానే ఈ పంచమిని 5 రకాలుగా నిర్వహిస్తారు.నీరు, గాలి, భూమి, ఆకాశం మరియు అగ్ని. ఈ పంచ భూతాలపై ఆధారపడి ప్రతి ఒక్కరి ఉనికి గుర్తుగా ఈ రంగుల పంచమి వేడుకలను నిర్వహిస్తారు.ఈరోజు అగ్ని వెలిగిస్తే మన జీవితంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం.

ఈ విధంగా రంగ్ పంచమి రోజున అగ్ని దహనంతో వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి సానుకూల వాతావరణంతో నిండిపోతుంది. కనుక ఈ వేడుకలకు గుర్తుగా రంగ్ పంచమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ రోజున ప్రజలందరూ ఎంతో సంతోషకరంగా రంగులను చల్లుకుంటూ పాటలు పాడుతూ, ఒకరికొకరు శుభాకాంక్షలను తెలియజేస్తుంటారు. ఈ రంగ్ పంచమి రోజుతోనే హోలీ వేడుకలు ముగుస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now