ఈరోజుల్లో బయట ఫుడ్స్ను అసలు నమ్మలేకుండా ఉన్నాము. హోటల్స్లో కుళ్లిపోయిన, ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ను జనాలకు వడ్డిస్తున్నారు. అసలు ఏమాత్రం నాణ్యతను పాటించడం లేదు. జనాల ఆరోగ్యం అంటే వ్యాపారులకు లెక్క లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో మనం ఇలాంటి సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఇలాంటిదే మరొక సంఘటన చోటు చేసుకుంది. కాకపోతే ఇది కాస్త భిన్నమైన విషయం. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఒకసారి చూస్తే..
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్న సెక్టార్ 12 ప్రాంతానికి చెందిన దీపా దేవి తన 5 ఏళ్ల కుమారుడికి మ్యాంగో షేక్ తయారు చేయాలని భావించి ఆన్లైన్లో అందుకు అవసరం అయిన ఐస్క్రీమ్ను ఆర్డర్ చేసింది. ఓ ఈ-కామర్స్ డెలివరీ యాప్లో ఓ కంపెనీకి చెందిన ఐస్క్రీమ్ను ఆర్డర్ చేసింది. అయితే ఐస్క్రీమ్ డెలివరీ అయ్యాక దాని మూత తెరచి చూస్తే షాకవడం దీపా దేవి వంతైంది. ఎందుకంటే ఐస్క్రీమ్ బాక్స్లో ఓ కాళ్ల జెర్రి గడ్డకట్టుకుని పోయి కనిపించింది. అది ఐస్క్రీమ్ మీదే ఉంది.
దీంతో ఆమెకు వెంటనే వెన్నులో జలదరింపు వచ్చింది. అయితే వెంటనే తేరుకుని ఆ ఐస్క్రీమ్ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. అయితే ఈ సంఘటనపై ఆమె సదరు యాప్లో ఫిర్యాదు చేయగా వారు ఆమెకు ఆ ఐస్క్రీమ్ ఖరీదు రూ.195 తిరిగి ఇచ్చేశారు. అలాగే సదరు ఐస్క్రీమ్ కంపెనీకి సైతం తాము ఫిర్యాదు చేశామని, వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని సదరు యాప్ వారు ఆమెకు తెలియజేశారు. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ విషయం మరోమారు తెరపైకి వచ్చింది. అసలు బయటి ఫుడ్స్ను తినాలంటేనే భయపడాల్సి వస్తుందని జనాలంటున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…