ఈరోజుల్లో బయట ఫుడ్స్ను అసలు నమ్మలేకుండా ఉన్నాము. హోటల్స్లో కుళ్లిపోయిన, ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ను జనాలకు వడ్డిస్తున్నారు. అసలు ఏమాత్రం నాణ్యతను పాటించడం లేదు. జనాల ఆరోగ్యం అంటే వ్యాపారులకు లెక్క లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో మనం ఇలాంటి సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఇలాంటిదే మరొక సంఘటన చోటు చేసుకుంది. కాకపోతే ఇది కాస్త భిన్నమైన విషయం. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఒకసారి చూస్తే..
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్న సెక్టార్ 12 ప్రాంతానికి చెందిన దీపా దేవి తన 5 ఏళ్ల కుమారుడికి మ్యాంగో షేక్ తయారు చేయాలని భావించి ఆన్లైన్లో అందుకు అవసరం అయిన ఐస్క్రీమ్ను ఆర్డర్ చేసింది. ఓ ఈ-కామర్స్ డెలివరీ యాప్లో ఓ కంపెనీకి చెందిన ఐస్క్రీమ్ను ఆర్డర్ చేసింది. అయితే ఐస్క్రీమ్ డెలివరీ అయ్యాక దాని మూత తెరచి చూస్తే షాకవడం దీపా దేవి వంతైంది. ఎందుకంటే ఐస్క్రీమ్ బాక్స్లో ఓ కాళ్ల జెర్రి గడ్డకట్టుకుని పోయి కనిపించింది. అది ఐస్క్రీమ్ మీదే ఉంది.
దీంతో ఆమెకు వెంటనే వెన్నులో జలదరింపు వచ్చింది. అయితే వెంటనే తేరుకుని ఆ ఐస్క్రీమ్ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. అయితే ఈ సంఘటనపై ఆమె సదరు యాప్లో ఫిర్యాదు చేయగా వారు ఆమెకు ఆ ఐస్క్రీమ్ ఖరీదు రూ.195 తిరిగి ఇచ్చేశారు. అలాగే సదరు ఐస్క్రీమ్ కంపెనీకి సైతం తాము ఫిర్యాదు చేశామని, వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని సదరు యాప్ వారు ఆమెకు తెలియజేశారు. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ విషయం మరోమారు తెరపైకి వచ్చింది. అసలు బయటి ఫుడ్స్ను తినాలంటేనే భయపడాల్సి వస్తుందని జనాలంటున్నారు.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…