Tuesday : ప్రతి రోజూ మనం అన్ని పనులు చేయడానికి అనుకూలంగా ఉండవు. ముఖ్యంగా కొన్ని రోజుల్లో కొన్ని పనులను చేయడం అసలు మంచిది కాదని పండితులు అంటున్నారు. మంగళవారం నాడు ఈ తప్పుల్ని అస్సలు చేయకూడదు. తెలిసి చేసినా, తెలియక చేసినా ఇవి తప్పే అని తెలుసుకోండి. మంగళవారం అనగానే అమంగళంగా చాలామంది భావిస్తారు. కానీ నిజానికి మంగళవారం కొన్ని పనులు చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.
నవగ్రహాల్లో ఉన్న కుజుడు మంగళవారానికి అధిపతి. కుజుడు రౌద్రాన్ని కలిగి ఉంటాడు. కనుక మంగళవారం రోజు పది మంది కలిసి చేసే పనులని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. పది మంది కలిసి చేస్తే కుజుడికి కోపం వస్తుంది. దాంతో నలుగురి మధ్య గొడవలు, కొట్టుకోవడం వంటివి జరుగుతాయి. మంగళవారం నాడు ఎంత పని ఉన్నా ఒక్కరే చేసుకోవడం మంచిది. మంగళవారం రోజు అప్పు తీసుకోకూడదు. మంగళవారం నాడు అప్పు తీర్చడం చాలా మంచిది.
మంగళవారం నాడు అప్పు తీరిస్తే మళ్లీ చేయవలసిన అవసరం రాదట. మంగళవారం శస్త్ర చికిత్స చేసుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో గోళ్లు కత్తిరించడం, క్షవరం చేయించుకోవడం వంటి పనులు చేయకండి. మంగళవారం నాడు ఇల్లు, భూమిని కొనడం వంటివి చేయకూడదు. రిజిస్ట్రేషన్ పనులు కూడా చేయకూడదు.
మంగళవారం నాడు ఇటువంటి పనులు చేయడానికి తుది నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. మంగళవారం నాడు క్రీడలకు సంబంధించిన కోచింగ్లో చేరడం కూడా మంచిది. మంగళవారం నాడు వాహనాలు మాత్రం కొనుగోలు చేయకూడదు. మంగళవారం నాడు నూతన వ్యాపారాలు ప్రారంభించడం కూడా మంచిది కాదు. మంగళవారం నాడు వ్యవసాయదారులు మిరప, అల్లం, ఉల్లి, వెల్లుల్లి, పొగాకు వంటి వాటికి సంబంధించిన పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…