Vastu Tips : మన పెద్దవాళ్లు ఇలా జరగకూడదు, ఇలా జరిగితే మంచిది కాదు. ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు. కొంతమంది వీటిని పాటిస్తే, కొంత మంది మాత్రం వీటిని కొట్టి పారేస్తూ ఉంటారు. మన చేతిలో నుండి, కొన్ని కొన్ని వస్తువులు జారీ పడిపోకూడదు. ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా, ఒక్కొక్కసారి ఏదో ఒకటి మన చేతి నుండి జారిపోతూ ఉంటాయి. అయితే, వీటిని పట్టుకునేటప్పుడు మాత్రం, జాగ్రత్తగా పట్టుకోవాలి. కింద పడిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా, ఇవి చేయి జారిపోకుండా చూసుకోండి. లేదంటే దురదృష్టం కలుగుతుంది. ఇబ్బందులు వస్తాయి. ఇవి కనుక, చేతి నుండి కింద పోయాయంటే, జీవితం పై ప్రతికూల ప్రభావం కనబడుతుంది.
ఇక ఎటువంటి వస్తువులు చేతి నుండి జారి పడకూడదు అనే విషయాన్ని చూసేద్దాం. చేతి నుండి ఎప్పుడూ కూడా ఉప్పు జారిపోవడం మంచిది కాదు. జాగ్రత్తగా ఉప్పుని పట్టుకోవాలి. లక్ష్మీదేవి ప్రతిరూపం ఉప్పు. శనిప్రభావముని తొలగించేందుకు, చాలామంది ఉప్పును దానం చేస్తారు. ఉప్పు కనుక జారి కింద పడింది అంటే డబ్బు కొరత వస్తుంది. కాబట్టి, ఉప్పుని పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
పాలు ఎప్పుడు కూడా కింద పడిపోకూడదు. పాలు కనుక కింద చేజారి పడిపోయాయి అంటే ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కలుగుతాయి. గృహప్రవేశం అప్పుడు మాత్రమే పాలని పొంగిస్తారు. కానీ, పాలు ఎప్పుడు పడితే అప్పుడు కింద పడిపోకూడదు. నల్ల మిరియాలు చేజారి పోతే కూడా అసలు మంచిది కాదు. ఇలా చేజారిపోతే, అనారోగ్య సమస్యలు వస్తాయి.
పూజ ఫలకం కింద పడిందంటే, అసలు మంచిది కాదు. ఇలా జరిగితే, కుటుంబంలో పెద్ద సంక్షోభం ఏర్పడబోతోందని దానికి కారణం. కాబట్టి, ఈ తప్పు కూడా జరగకుండా చూసుకోవాలి. మనం తినే ఆహారాన్ని ఎప్పుడు కింద పడేయకూడదు. ఎప్పుడూ కూడా అన్నం ని జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నం కింద పడిందంటే, తీసుకుని కళ్ళకు అద్దుకోవాలి చాలామంది తరచూ అన్నాన్ని పడేస్తూ ఉంటారు. అలా జరిగితే ఆర్థిక బాధలు వస్తాయి లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…