Money : ప్రతి ఒక్కరు ఇంట్లో అందరూ బాగుండాలని, ఎవరికి ఏ కష్టం రాకుండా ఉండాలని కోరుకుంటారు. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాము. ఒకవేళ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే మనం శారీరక సమస్యలతో పాటు మానసిక ఒత్తిడిని భరించాల్సి ఉంటుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితులల్లో ఇంట్లో సానుకూలత తీసుకురావడానికి మనం కొన్ని చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులు చేయడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు నెలకొంటుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
ఇంట్లో సానుకూలత రావాలంటే మనం చేయాల్సిన పనులు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో సానుకూలత రావాలన్నా మనపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలన్నా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఇంటికి ఉండే ప్రధాన తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మురికి చెప్పులు, బూట్లు ఉండకూడదు. అలాగే ఇంట్లో సానుకూలత పెరగాలంటే నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. రోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. దీపాన్ని వెలిగించడానికి ఆవాల నూనెను ఉపయోగిస్తే మరింత మేలు కలుగుతుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులను కట్టడం మంచిది.
ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూలత తొలిగిపోతుంది. ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరగకుండా ఉంటాయి. అదే విధంగా రోజూ ఉదయం మరియు సాయంత్రం తులసిని పూజించాలి. ఇంట్లో సానుకూలత పెరగాలంటే రోజూ తులసి మొక్కకు ఉదయం నీరు పోసి సాయంత్రం దీపం వెలిగించాలి. అలాగే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తరువాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. ఇలా చేయడం వల్ల మీ స్థానం మరియు గౌరవం పెరుగుతుంది. ఈ విధంగా ఈ పనులను చేయడం వల్ల ఇంట్లో సానుకూలత పెరగడంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…
కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన…