Money : ప్రతి ఒక్కరు ఇంట్లో అందరూ బాగుండాలని, ఎవరికి ఏ కష్టం రాకుండా ఉండాలని కోరుకుంటారు. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాము. ఒకవేళ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే మనం శారీరక సమస్యలతో పాటు మానసిక ఒత్తిడిని భరించాల్సి ఉంటుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితులల్లో ఇంట్లో సానుకూలత తీసుకురావడానికి మనం కొన్ని చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులు చేయడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు నెలకొంటుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
ఇంట్లో సానుకూలత రావాలంటే మనం చేయాల్సిన పనులు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో సానుకూలత రావాలన్నా మనపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలన్నా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఇంటికి ఉండే ప్రధాన తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మురికి చెప్పులు, బూట్లు ఉండకూడదు. అలాగే ఇంట్లో సానుకూలత పెరగాలంటే నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. రోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. దీపాన్ని వెలిగించడానికి ఆవాల నూనెను ఉపయోగిస్తే మరింత మేలు కలుగుతుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులను కట్టడం మంచిది.
ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూలత తొలిగిపోతుంది. ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరగకుండా ఉంటాయి. అదే విధంగా రోజూ ఉదయం మరియు సాయంత్రం తులసిని పూజించాలి. ఇంట్లో సానుకూలత పెరగాలంటే రోజూ తులసి మొక్కకు ఉదయం నీరు పోసి సాయంత్రం దీపం వెలిగించాలి. అలాగే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తరువాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. ఇలా చేయడం వల్ల మీ స్థానం మరియు గౌరవం పెరుగుతుంది. ఈ విధంగా ఈ పనులను చేయడం వల్ల ఇంట్లో సానుకూలత పెరగడంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్ఫామ్కు బాగా అలవాటు పడ్డారు.…
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్పై తెరకెక్కుతున్న…
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్ఫామ్లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…