House Vastu : ఇప్పటికి కూడా చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తున్నారు. వాస్తు ప్రకారం మనం పాటించడం వలన అంతా మంచే జరుగుతుంది. అయితే ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే కాదు, ఇల్లు కట్టిన తర్వాత కూడా వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇల్లు కట్టేసిన తర్వాత ఇంట్లో ఉండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి పొరపాట్లని చేయకూడదు అనేది తెలుసుకుందాం. ఇంటి ముందు ఎంత శుభప్రదంగా ఉంటే, ఆ ఇంటికి అంత మంచి జరుగుతుంది. ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.
ఇంటి ముందు మురికి నీళ్లు వచ్చి చేరేలా ఉండకూడదు. అలానే ఇంటి ముందు ముళ్ళకి సంబంధించిన మొక్కల్ని పెంచకూడదు. ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి. ఇంటికి ముందు విరిగిపోయిన సామాన్లు, పాడైపోయిన సామాన్లని పెట్టకూడదు. ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉండకూడదు. కాబట్టి ఇంటిని కట్టుకునేటప్పుడే ఇవేమీ లేకుండా చూసుకోవడం మంచిది.
ఇంటి ముందు ఉండే రోడ్డు ఎప్పుడు కూడా తక్కువ స్థాయిలోనే ఉండాలి. అంటే మన గుమ్మం ఎత్తుగా ఉండాలి. రోడ్డు మన గుమ్మం కంటే తక్కువ ఉండాలి. ఇంటికి ఎదురుగుండా ఎప్పుడూ చెప్పులని విడిచి పెట్టకూడదు. అలా పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రాదు. ఇంటికి ఎదురుగా దేవుడు గుడి కానీ వీధి కానీ రోడ్డు కానీ బోరు కానీ బావి కానీ ఉండకూడదు.
అలా ఉన్నట్లయితే గుమ్మానికి వీధి పోటు వచ్చి ఇంటి సభ్యులు ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా మెట్లు ఉంటే కష్టాలు వస్తాయి. ఇంటికి ఎదురుగా చీపురు పెట్టకూడదు. ఇంటి చుట్టూ తీగ చెట్లు ఎక్కువగా ఉండకూడదు. ఇలా ఇల్లు కట్టేటప్పుడు ఈ విధంగా పాటించాలి. వాస్తు ప్రకారం జాగ్రత్తగా ఉంటే, అంతా మంచే జరుగుతుంది. శుభం కలుగుతుంది. లేదంటే అనవసరంగా లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…