ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఏ కష్టాలు ఉండకూడదని, ఎలాంటి సమస్యలు ఉండకూడదని కోరుకుంటుంటారు. ఏ బాధలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలను కనుక ఇళ్లల్లో పాటించినట్లయితే, దురదృష్టం తొలగిపోయి, అదృష్టం వస్తుంది. చాలామంది వాస్తుకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
వాస్తు ప్రకారం పాటించడం వలన ఎలాంటి సమస్యలు కూడా రావు. ఆర్థిక ఇబ్బందులు మొదలు అనేక సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. అదృష్టం వచ్చి ఆనందంగా ఉండాలని అనుకునే వాళ్ళు, ఈ తప్పులను ఇళ్లలో అసలు చేయకండి. ఇళ్లల్లో ముళ్ళ మొక్కలని పెట్టుకోవడం మంచిది కాదు. గులాబీ తప్ప మిగిలిన ముళ్ళ మొక్కల్ని, ఇంట్లో పెట్టుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. సంతోషంగా జీవించలేరు. కనుక ముళ్ళ మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. విరిగిపోయిన దేవుడి విగ్రహాలని ఇళ్లల్లో పెట్టుకోవడం మంచిది కాదు. పాడైపోయినవి, విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఇంట్లో ఉండడం వలన ఆనందం ఉండదు.
విరిగిపోయిన అద్దాలని ఇంట్లో పెట్టుకోవడం వలన, మానసిక ప్రశాంతత ఉండదు. ఆర్థిక నష్టాలు కలుగుతాయి. కాబట్టి, ఎప్పుడూ కూడా పనికిరాని సామాన్లని ఇంట్లో పెట్టుకోవద్దు. నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం కూడా మంచిది కాదు. దీనికి కారణం ఏంటి అంటే శివతాండవమే. దానివలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. ఇంట్లో చాలామంది ఫోటో ఫ్రేమ్ లను పెట్టుకుంటుంటారు. ఫోటో ఫ్రేమ్ లని పెట్టుకునేటప్పుడు మునిగిపోతున్న ఓడ, యుద్ధానికి సంబంధించిన ఫోటోలు, బాధ కలిగించే వాటిని అస్సలు పెట్టుకోకూడదు.
రామాయణ, మహాభారతము కి సంబంధించిన సన్నివేశాలు తాలూకా ఫోటోలను కూడా ఇళ్లల్లో పెట్టుకోవడం మంచిది కాదు. పందులు, పాములు, గాడిద, గుడ్లగూబ, పావురం, కాకి ఇటువంటి వాటిని కూడా ఇళ్లలో పెట్టుకోకూడదు. వీటి తాలూకా పెయింటింగ్స్ ని కానీ ఫోటోలని కానీ ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. ఇలాంటి వాటి వలన చెడు జరుగుతుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…