కరోనా వల్ల ప్రస్తుతం చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు, ఉద్యోగులు పనికి ల్యాప్టాప్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో గత ఏడాది కాలంగా ల్యాప్టాప్ ల కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. అయితే ల్యాప్టాప్లను కొనాలని అనుకుంటున్న వారు ముందుగా చెక్ చేయాల్సిన ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ల్యాప్టాప్ కొనాలని అనుకునే వారు దాన్ని ఏవిధంగా, ఏ పనికి వాడాలనుకుంటున్నారో ముందుగా తెలుసుకోవాలి. సాధారణ పనులకు అయితే నార్మల్ ల్యాప్టాప్ సరిపోతుంది. అదే వీడియోల ఎడిటింగ్, గ్రాఫిక్స్, డిజైనింగ్ అయితే గ్రాఫిక్ కార్డు ఉన్న ల్యాప్టాప్ను తీసుకోవాలి. ఈ క్రమంలో కనీసం 4జీబీ కెపాసిటీ ఉన్న గ్రాఫిక్ కార్డు ఉండేలా ల్యాప్టాప్ను ఎంచుకోవాలి. దీంతో గ్రాఫిక్స్, ఎడిటింగ్ పని సులభతరం అవుతుంది. ఇక సాధారణ పనులకు గ్రాఫిక్ కార్డు అవసరం లేదు. నార్మల్ ల్యాప్ టాప్ కొంటే చాలు.
సాధారణంగా ల్యాప్టాప్లో ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ కనీసం ఉండేలా చూసుకోవాలి. దీంతో ల్యాప్టాప్ వేగంగా పనిచేస్తుంది. అలాగే కనీసం 128జీబీ ఎస్ఎస్డీ అయినా ఉండేలా చూసుకోవాలి. ఎస్ఎస్డీ అంటే ఓ రకమైన హార్డ్ డిస్క్. ఇందులో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుంది. సాధారణ హార్డ్ డిస్క్ కన్నా ఎస్ఎస్డీ వేగంగా పనిచేస్తుంది. కనుక ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్తోపాటు ఎస్ఎస్డీని కూడా అందిస్తారు. ఎస్ఎస్డీలో విండోస్ సి డ్రైవ్ ఉంటుంది. మిగిలిన డ్రైవ్లు మనకు హార్డ్ డిస్క్లో ఉంటాయి.
ఎస్ఎస్డీ వల్ల ల్యాప్టాప్ వేగంగా పనిచేస్తుంది. కనుక కనీసం 128జీబీ ఎస్ఎస్డీ ఉండేలా ల్యాప్టాప్ తీసుకోవాలి. దీంతో పనిచేసే సాఫ్ట్వేర్లు వేగంగా ఉంటాయి.
ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ కింద చెప్పిన విధంగా ఉంటే మేలు. ఇది కనీస కాన్ఫిగరేషన్. ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసుకోవచ్చు. బడ్జెట్ ఉందనుకుంటే ఇంతకన్నా ఎక్కువ కాన్ఫిగరేషన్తో ల్యాప్టాప్ కొనవచ్చు.
ఈ విధంగా కాన్ఫిగరేషన్ ఉండేలా ల్యాప్టాప్ ను తీసుకుంటే వేగంగా పనిచేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డులు ఉన్న ల్యాప్టాప్లు ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. సాధారణ ల్యాప్టాప్లు ధర తక్కువగా ఉంటాయి. కనుక ఈ రెండు రకాల్లో ఏది అవసరమో తెలుసుకుని తరువాత ల్యాప్టాప్ను కొనుగోలు చేస్తే మంచిది.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…