భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం కాదని క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 22, 2026) అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత జట్టు ఘోర పరాజయం పాలవడంపై గవాస్కర్ స్పందించారు. ఈ మేరకు ఆయన జియోస్టార్ చానల్లో మాట్లాడుతూ సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో ఆ జట్టు బ్యాటర్లు మిల్లర్, బ్రెవిస్ ఆడిన ఆటతీరును చూసి కూడా భారత బ్యాటర్లు తమ పంథాను మార్చుకోలేదని అన్నారు. మిల్లర్, బ్రెవిస్ల మాదిరిగా పార్ట్నర్షిప్ను నిర్మించి ఆటను ఆడాలని, అదే సరైన విధానమని అన్నారు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ అనేక తప్పులు చేసిందన్న ఆయన, రానున్న మ్యాచ్లలో పలు మార్పులు చేసి సరైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప గెలవలేరని అన్నారు.
సౌతాఫ్రికా బ్యాటర్లు ఆడినట్లు భారత బ్యాటర్లు పార్ట్నర్షిప్ను నిర్మించలేదని, భారత ప్లేయర్లు మైదానంలోకి ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చారని గవాస్కర్ అన్నారు. వారు తమ బ్యాట్లను ఎటు పడితే అటు ఊపి వికెట్లను పారేసుకున్నారని, ఈ విషయంలో సౌతాఫ్రికా చాలా తెలివిగా వ్యవహరించి వారిని ఔట్ చేసిందని అన్నారు. అన్ని విధాలుగా సౌతాఫ్రికా జట్టు ఈ విజయానికి అర్హమైందని అన్నారు. సౌతాఫ్రికా బ్యాటర్ల ఇన్నింగ్స్ను చూసి భారత బ్యాటర్లు మ్యాచ్ కండిషన్లను అర్థం చేసుకోలేకపోయారని, ఇన్నింగ్స్లో ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ఒకే ఆలోచనతో ఆడారని, అందుకనే త్వరగా ఔటయ్యారని, టీ20 క్రికెట్ను ఆడే పద్ధతి అది కాదని గవాస్కర్ పేర్కొన్నారు.
మ్యాచ్లో సొంత తెలివితేటలను ఉపయోగించడమే కాదు, ప్రత్యర్థి జట్టు ఎలా ఆడుతుందన్న విషయాన్ని కూడా గమనించాలని గవాస్కర్ భారత జట్టుకు సూచించారు. ప్రత్యర్థి ప్లేయర్ల ఆటతీరును అర్థం చేసుకోలేదని భారత బ్యాటర్లను విమర్శించారు. అహ్మదాబాద్ లాంటి క్లిష్టమైన పిచ్పై సౌతాఫ్రికా బ్యాటర్లు మెరుగ్గా రాణించారని, భారత బ్యాటర్లు ఎందుకు ఆడలేకపోయారని ప్రశ్నించారు. భారత ప్లేయర్లు ఈగోను ప్రదర్శించారని దుయ్యబట్టారు. తిలక్ వర్మ అద్భుతమైన ఆటగాడేనని, కానీ ఈ మ్యాచ్లో అతను ఆడిన తీరు సరిగ్గా లేదని అన్నారు. కిషన్ మొదటి ఓవర్లోనే ఔట్ కావడంతో కావల్సిన రన్ రేట్ 9.5గా ఉందని, అది 15 లేదని, అంతలా ప్రతి బాల్ను షాట్ ఆడాల్సిన అవసరం ఏమిటని గవాస్కర్ ప్రశ్నించారు.
తిలక్ వర్మ ఇంకాస్త సేపు సమయం కేటాయించి ఉండాల్సిందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అభిషేక్ ఫామ్లో లేడు కనుక తిలక్ కాసేపు ఆడి పార్ట్నర్షిప్ను నిర్మించి ఉంటే 6 ఓవర్ల పవర్ ప్లే పూర్తయ్యేదని, తరువాత కండిషన్కు అనుగుణంగా ఆడి ఉంటే సరిపోయేదని అన్నారు. పవర్ ప్లేలో 6 ఓవర్లకు 70 పరుగులు చేయాల్సిన అవసరం లేదని, 55-60 పరుగులు చేసినా ఇన్నింగ్స్ ను చక్కగా నిర్మించుకోవచ్చని అన్నారు. కానీ భారత బ్యాటర్లు నిర్లక్ష్యపూరిత షాట్లను ఆడి మొత్తం టీంను పతనం దిశగా నడిపించారని విచారం వ్యక్తం చేశారు. వచ్చే మ్యాచ్లలో సుందర్ కు బదులుగా అక్షర్ను తీసుకోవాలని, అతను గతంలో జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే సౌతాఫ్రికాపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని, కనుక అక్షర్ ఉంటే టీం బ్యాలెన్స్ అవుతుందని, సుందర్ సరిగ్గా రాణించలేకపోతున్నాడని గవాస్కర్ సూచనలు చేశారు.
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…
టీ20 ప్రపంచకప్ 2026లోనే కాదు, అంతకు ముందు కూడా భారత జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విజయాల బాటలో నడిపిస్తూ…
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్ను వివాహం చేసుకున్నాడు. శనివారం (ఫిబ్రవరి 21,…
టీ20 వరల్డ్ కప్ 2026లో చెత్త ప్రదర్శనపై టీమిండియా బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు స్సందించాడు. టోర్నీలో ఇప్పటి…
దక్షిణాది సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి రెజీనా కసాండ్రా తాజాగా బాలీవుడ్లో ఎదుర్కొన్న కఠిన అనుభవాలపై…