ఆఫ్‌బీట్

8 ఏళ్ల కింద చ‌నిపోయిన బాలుడు.. పున‌ర్జ‌న్మించి వ‌చ్చాన‌ని చెబుతున్న ఇంకో బాలుడు.. అంద‌రినీ గుర్తు కూడా ప‌డుతున్నాడు..!

మ‌నుషులు చ‌నిపోయాక మ‌ళ్లీ ఇంకొక‌రికి పుట్ట‌డాన్ని పున‌ర్జ‌న్మ అంటారు. ఇది నిజంగా ఉందో లేదో తెలియదు కానీ.. సినిమాల్లో అయితే మ‌నం చాలా చూశాం. ఒక‌రికి పుట్టిన వారు చ‌నిపోయి పున‌ర్జ‌న్మించి ఇంకొక‌రికి పుడుతుంటారు. త‌రువాత వారికి గ‌త జ‌న్మ తాలూకు విష‌యాలు గుర్తుకు వ‌స్తాయి. ఈ విధంగా సినిమాల్లోనే జ‌రుగుతుంటుంది. వాస్త‌వ జీవితంలో అస‌లు జ‌ర‌గ‌దు. కానీ ఇప్పుడు చెప్పే సంఘ‌ట‌న గురించి తెలిస్తే నిజంగా అలా జ‌రుగుతుంద‌ని మీరు కూడా న‌మ్ముతారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా నాగ్లా స‌లేహి గ్రామానికి చెందిన ప్ర‌మోద్ కుమార్ అనే వ్య‌క్తి కుమారుడు రోహిత్ కుమార్ మే 4, 2013న చ‌నిపోయాడు. స‌మీపంలో ఉన్న కెనాల్‌లో స్నానానికి వెళ్లి అందులో మునిగి మృతి చెందాడు.

అయితే ఆ గ్రామానికి స‌మీపంలో ఉన్న రామ్ న‌రేష్ శంఖ్‌వార్ అనే వ్య‌క్తి కుమారుడు చంద్ర‌వీర్ అలియాస్ ఛోటు ఇటీవ‌ల ప్ర‌మోద్ కుమార్ ఇంటికి వ‌చ్చి తాను గ‌త జ‌న్మ‌లో రోహిత్ కుమార్ అని చెప్పాడు. అంతేకాదు, రోహిత్ కుటుంబ స‌భ్యులంద‌రినీ గుర్తు ప‌ట్టాడు. ఈ క్ర‌మంలో అత‌న్ని రోహిత్ చ‌దివిన స్కూల్‌కు కూడా తీసుకెళ్లారు. అక్క‌డ ఛోటు అంద‌రినీ గుర్తు ప‌ట్టాడు. దీంతో గ్రామ‌స్థులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా రామ్ న‌రేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ త‌న కుమారుడు ఛోటు ఎప్పుడూ గ‌త జ‌న్మ గురించి చెప్పేవాడ‌ని, కానీ అత‌ను త‌మ నుంచి దూరం అవుతాడ‌ని భ‌యం వేసి అత‌న్ని నాగ్లా స‌లేహి గ్రామానికి పంపించేవాళ్లం కాద‌ని, కానీ ఇప్పుడు రాక త‌ప్ప‌లేద‌ని తెలిపాడు. ఏది ఏమైనా ఒక‌ప్పుడు చ‌నిపోయాడ‌నుకున్న బాలుడు ఇప్పుడు మ‌ళ్లీ వ‌చ్చి తాను పున‌ర్జ‌న్మించాన‌ని చెబుతుండ‌డం, అంద‌రినీ గుర్తు ప‌డుతుండ‌డం నిజంగానే అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

భారత్‌లోకి REDMI Note 15 Pro సిరీస్: 200MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…

Friday, 30 January 2026, 9:51 PM

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM

రైలులో టికెట్ లేదా? భయపడకండి.. ఈ రూల్స్ తెలిస్తే చాలు!

రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…

Thursday, 29 January 2026, 6:12 PM