మనుషులు చనిపోయాక మళ్లీ ఇంకొకరికి పుట్టడాన్ని పునర్జన్మ అంటారు. ఇది నిజంగా ఉందో లేదో తెలియదు కానీ.. సినిమాల్లో అయితే మనం చాలా చూశాం. ఒకరికి పుట్టిన వారు చనిపోయి పునర్జన్మించి ఇంకొకరికి పుడుతుంటారు. తరువాత వారికి గత జన్మ తాలూకు విషయాలు గుర్తుకు వస్తాయి. ఈ విధంగా సినిమాల్లోనే జరుగుతుంటుంది. వాస్తవ జీవితంలో అసలు జరగదు. కానీ ఇప్పుడు చెప్పే సంఘటన గురించి తెలిస్తే నిజంగా అలా జరుగుతుందని మీరు కూడా నమ్ముతారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లా నాగ్లా సలేహి గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి కుమారుడు రోహిత్ కుమార్ మే 4, 2013న చనిపోయాడు. సమీపంలో ఉన్న కెనాల్లో స్నానానికి వెళ్లి అందులో మునిగి మృతి చెందాడు.
అయితే ఆ గ్రామానికి సమీపంలో ఉన్న రామ్ నరేష్ శంఖ్వార్ అనే వ్యక్తి కుమారుడు చంద్రవీర్ అలియాస్ ఛోటు ఇటీవల ప్రమోద్ కుమార్ ఇంటికి వచ్చి తాను గత జన్మలో రోహిత్ కుమార్ అని చెప్పాడు. అంతేకాదు, రోహిత్ కుటుంబ సభ్యులందరినీ గుర్తు పట్టాడు. ఈ క్రమంలో అతన్ని రోహిత్ చదివిన స్కూల్కు కూడా తీసుకెళ్లారు. అక్కడ ఛోటు అందరినీ గుర్తు పట్టాడు. దీంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాగా రామ్ నరేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ తన కుమారుడు ఛోటు ఎప్పుడూ గత జన్మ గురించి చెప్పేవాడని, కానీ అతను తమ నుంచి దూరం అవుతాడని భయం వేసి అతన్ని నాగ్లా సలేహి గ్రామానికి పంపించేవాళ్లం కాదని, కానీ ఇప్పుడు రాక తప్పలేదని తెలిపాడు. ఏది ఏమైనా ఒకప్పుడు చనిపోయాడనుకున్న బాలుడు ఇప్పుడు మళ్లీ వచ్చి తాను పునర్జన్మించానని చెబుతుండడం, అందరినీ గుర్తు పడుతుండడం నిజంగానే అందరినీ షాక్కు గురి చేస్తోంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…