Virat Kohli : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కోహ్లి పెట్టే పోస్టులు అప్పుడప్పుడు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంటాయి. ఇక తాజాగా దీపావళి నేపథ్యంలో కోహ్లి మరోమారు పోస్టు పెట్టగా.. దాని పట్ల నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీపావళి పండుగ వస్తుందని, కుటుంబ సభ్యుల నడుమ ఆనందోత్సాహాలతో పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని.. తాను సమయం దొరికినప్పుడు దీపావళిని ఎలా జరుపుకోవాలో.. టిప్స్ ఇస్తానని.. చెబుతూ కోహ్లి ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లు దీనిపై మండి పడుతున్నారు.
నిజానికి కోహ్లి గతేడాది కూడా ఇలాగే దీపావళికి బాణసంచా కాల్చవద్దని, పర్యావరణాన్ని రక్షించాలని కోరాడు. కానీ నెటిజన్లు అప్పుడు కూడా ఇలాగే స్పందించారు. కోహ్లిని తీవ్రంగా విమర్శించారు. ఇక ఇప్పుడు కూడా కోహ్లిపై అలాగే మాటల దాడి చేస్తున్నారు.
కోహ్లి నీతులు చెప్పడం ఆపాలని, ఇతర పండుగలకు అయితే ఇలాగే చెబుతావా ? అని అందరూ కోహ్లిని విమర్శిస్తున్నారు. రోహిత్ శర్మ దీపావళికి బాణసంచా కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటే చూడాలని ఉందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2021 సీజన్లో బెంగళూరు ప్లే ఆఫ్స్లో చతికిల పడింది. తక్కువ పరుగుల స్కోర్ చేసి దాన్ని డిఫెండ్ చేయలేకపోయింది. దీంతో కోహ్లిపై బెంగళూరు ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఈ వివాదం చుట్టు ముట్టింది. అయితే టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెబుతానని ఇప్పటికే కోహ్లి ప్రకటించాడు. దీంతో ఇది కెప్టెన్గా అతనికి ఆఖరి టీ20 వరల్డ్ కప్ అయింది. మరి ఈ కప్ను అతని సారథ్యంలో టీమిండియా సాధిస్తుందో, లేదో చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…