Virat Kohli : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కోహ్లి పెట్టే పోస్టులు అప్పుడప్పుడు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంటాయి. ఇక తాజాగా దీపావళి నేపథ్యంలో కోహ్లి మరోమారు పోస్టు పెట్టగా.. దాని పట్ల నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీపావళి పండుగ వస్తుందని, కుటుంబ సభ్యుల నడుమ ఆనందోత్సాహాలతో పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని.. తాను సమయం దొరికినప్పుడు దీపావళిని ఎలా జరుపుకోవాలో.. టిప్స్ ఇస్తానని.. చెబుతూ కోహ్లి ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లు దీనిపై మండి పడుతున్నారు.
నిజానికి కోహ్లి గతేడాది కూడా ఇలాగే దీపావళికి బాణసంచా కాల్చవద్దని, పర్యావరణాన్ని రక్షించాలని కోరాడు. కానీ నెటిజన్లు అప్పుడు కూడా ఇలాగే స్పందించారు. కోహ్లిని తీవ్రంగా విమర్శించారు. ఇక ఇప్పుడు కూడా కోహ్లిపై అలాగే మాటల దాడి చేస్తున్నారు.
కోహ్లి నీతులు చెప్పడం ఆపాలని, ఇతర పండుగలకు అయితే ఇలాగే చెబుతావా ? అని అందరూ కోహ్లిని విమర్శిస్తున్నారు. రోహిత్ శర్మ దీపావళికి బాణసంచా కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటే చూడాలని ఉందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2021 సీజన్లో బెంగళూరు ప్లే ఆఫ్స్లో చతికిల పడింది. తక్కువ పరుగుల స్కోర్ చేసి దాన్ని డిఫెండ్ చేయలేకపోయింది. దీంతో కోహ్లిపై బెంగళూరు ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఈ వివాదం చుట్టు ముట్టింది. అయితే టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెబుతానని ఇప్పటికే కోహ్లి ప్రకటించాడు. దీంతో ఇది కెప్టెన్గా అతనికి ఆఖరి టీ20 వరల్డ్ కప్ అయింది. మరి ఈ కప్ను అతని సారథ్యంలో టీమిండియా సాధిస్తుందో, లేదో చూడాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…