Viral Video : లంచం కోసం కొందరు ఏం చేయడానికైనా వెనుకాడరు. లంచం ఇస్తే ఏ పనైనా చేస్తారు. అయితే అక్కడ జరిగింది వేరే. రోగులు ఇచ్చిన రూ.500 లంచం కోసం ఇద్దరు సిబ్బంది సిగలు పట్టుకుని మరీ తన్నుకున్నారు. ఈ సంఘటన బీహార్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బీహార్లోని లక్ష్మీపూర్ బ్లాక్ ఏరియాలో ఉన్న జముయ్లో ఓ మహిళకు శిశువు జన్మించింది. అయితే ఆ శిశువుకు బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అక్కడే ఉన్న ఆశ వర్కర్ రింతు కుమారి ఆ శిశువును ఏఎన్ఎం వద్దకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఆ శిశువుకు చెందిన వారు ఇచ్చిన రూ.500 లంచాన్ని పంచుకునేందుకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఆశ వర్కర్ రింతు కుమారి, ఏఎన్ఎం ఇద్దరూ రూ.500 లంచం కోసం గొడవపడ్డారు. నాకంటే నాకని ఇద్దరూ గొడవపడగా.. అది పతాక స్థాయికి చేరుకుంది. చివరకు ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని తన్నుకున్నారు. ఆ తరువాత కొందరు వారిని విడదీశారు. దీంతో గొడవ సద్దు మణిగింది. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సంఘటనపై ఆ హాస్పిటల్ ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మన శంకర వర ప్రసాద్ గారుతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి…
భారత వన్డే జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడాలనే తన కోరికను స్పష్టంగా…
తమిళ నటుడు విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం థియేట్రికల్ రిలీజ్కు మళ్లీ సిద్ధమవుతోంది. రాజకీయాల్లో పూర్తిస్థాయి ప్రవేశానికి ముందు…
వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ ఇండియా ప్రత్యేక సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో ఆపిల్, శాంసంగ్, వన్ ప్లస్, ఐక్యూ,…
శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స భారత ఆటగాళ్లు ప్రత్యేక బ్యాట్లు ఉపయోగిస్తున్నారన్న తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. టీ20 ప్రపంచకప్…
నటి శ్రియా శరన్ ఇప్పటికీ తన అందం, నటన, గౌరవప్రదమైన ప్రయాణంతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న అగ్రనాయికలలో ఒకరిగా నిలుస్తున్నారు.…
గూగుల్ తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ పిక్సల్ 10ను కొనాలనుకున్నప్పటికీ ధర కారణంగా వెనకడుగు వేసిన వారికి శుభవార్త. పిక్సల్ 10…
టీ20 వరల్డ్కప్ 2026లో ఈసారి అమెరికాతో తలపడ్డ భారత్ అతికష్టం మీద గెలిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కొన్ని రోజుల…