Vijayashanti : నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద దుమారానే రేపుతున్నాయి. ఈమె యూపీలో గోహత్యలు, కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్ల హత్యలు ఒకటేనని.. పెద్దగా తేడా ఏమీ లేదని.. కామెంట్లు చేసింది. దీంతో ఆమెపై భజరంగ్ దళ్ ఫిర్యాదు చేసింది. సాయిపల్లవి తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై రాములమ్మగా పేరుగాంచిన నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. సాయిపల్లవిని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు.
సాయిపల్లవి తాజాగా చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ఖండించారు. ఆమె కామెంట్స్ వివాదాస్పదంగా ఉన్నాయన్నారు. ఆవులను చంపడం, కాశ్మీర్ పండిట్లను హత్య చేయడం రెండూ ఒకటే ఎలా అవుతాయని ప్రశ్నించారు. ఒక దొంగను కొట్టడం, తల్లి తన కుమారున్ని మందలించడం రెండూ ఒకటే ఎలా అవుతాయని.. అన్నారు. అలాగే సాయిపల్లవికి అసలు సమాజంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏం జరుగుతుంది.. అన్న విషయాలపై అవగాహన లేదని, అలాంటప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదని.. ఆమె నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని.. విజయశాంతి అన్నారు.
సెలబ్రిటీలుగా చెలామణీ అవుతున్నవారు సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు వెనుకా ముందు చూసుకుని.. బాగా ఆలోచించి మాట్లాడాలని.. విజయశాంతి అన్నారు. సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమాకు ప్రచారం కల్పించడం కోసమే ఆమెతో ఎవరో ఇలా మాట్లాడిస్తున్నారని.. విజయశాంతి ఆరోపించారు. అయితే ఈ వివాదం రోజు రోజుకీ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఈ క్రమంలోనే దీనిపై సాయిపల్లవి స్పందించాల్సి ఉంది.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…