Vijayashanti : నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద దుమారానే రేపుతున్నాయి. ఈమె యూపీలో గోహత్యలు, కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్ల హత్యలు ఒకటేనని.. పెద్దగా తేడా ఏమీ లేదని.. కామెంట్లు చేసింది. దీంతో ఆమెపై భజరంగ్ దళ్ ఫిర్యాదు చేసింది. సాయిపల్లవి తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై రాములమ్మగా పేరుగాంచిన నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. సాయిపల్లవిని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు.
సాయిపల్లవి తాజాగా చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ఖండించారు. ఆమె కామెంట్స్ వివాదాస్పదంగా ఉన్నాయన్నారు. ఆవులను చంపడం, కాశ్మీర్ పండిట్లను హత్య చేయడం రెండూ ఒకటే ఎలా అవుతాయని ప్రశ్నించారు. ఒక దొంగను కొట్టడం, తల్లి తన కుమారున్ని మందలించడం రెండూ ఒకటే ఎలా అవుతాయని.. అన్నారు. అలాగే సాయిపల్లవికి అసలు సమాజంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏం జరుగుతుంది.. అన్న విషయాలపై అవగాహన లేదని, అలాంటప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదని.. ఆమె నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని.. విజయశాంతి అన్నారు.
సెలబ్రిటీలుగా చెలామణీ అవుతున్నవారు సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు వెనుకా ముందు చూసుకుని.. బాగా ఆలోచించి మాట్లాడాలని.. విజయశాంతి అన్నారు. సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమాకు ప్రచారం కల్పించడం కోసమే ఆమెతో ఎవరో ఇలా మాట్లాడిస్తున్నారని.. విజయశాంతి ఆరోపించారు. అయితే ఈ వివాదం రోజు రోజుకీ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఈ క్రమంలోనే దీనిపై సాయిపల్లవి స్పందించాల్సి ఉంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…