Akhanda : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులది ఎంతటి సక్సెస్ కాంబినేషనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు కలసి చేసిన మూవీలు హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్లో వచ్చిన అఖండ భారీ విజయాన్ని సాధించింది. కరోనా తరువాత ఎలాంటి అంచనాలు లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ.125 కోట్లను రాబట్టింది. అయితే ఈ మూవీ చివర్లో అప్పట్లోనే దీనికి సీక్వెల్ ఉంటుందని.. బోయపాటి హింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన అఖండ 2 కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
అఖండ రిలీజ్ సమయంలోనే అఖండ 2 ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే బోయపాటి ప్రస్తుతం అఖండ సీక్వెల్కు కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ నేపథ్యంలో ఓ మూవీని తీయాల్సి ఉంది. దీన్ని వచ్చే ఎన్నికలకు విడుదల చేద్దామని భావించారు. కానీ అఖండకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా దీన్నే ముందు తీస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ మూవీకి ప్రస్తుతం కథను సిద్ధం చేస్తుండగా.. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది ముగిశాక అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఆ తరువాతే అఖండ 2 లాంచ్ అవుతుంది. అయితే బాలకృష్ణ సినిమాలు చేసేందుకు పెద్దగా సమయం తీసుకోరు. కనుక ఇంకో ఏడాదిలోనే అఖండ 2 వస్తుందని ఆశించవచ్చు.
ఇక అఖండ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కనుకనే అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ మూవీకి భారీగా బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారట. ఇక కథ కూడా పూర్తిగా అఘోరాల మీదే ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తుందని అంటున్నారు. ఇక అఖండ 2 అప్డేట్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…