Udaya Bhanu : ఉదయభాను యాంకర్గానే కాక సినిమాల్లోనూ కూడా నటించి అలరించింది. ఈమె రానా హీరోగా వచ్చిన లీడర్ సినిమాలో రాజశేఖరా.. అంటూ ప్రత్యేక పాటలోనూ నర్తించి ఆకట్టుకుంది. ఇటీవల పుష్ప సక్సెస్ ప్రోగ్రాం కర్నూల్ లో యాంకర్ గా చేసి బన్నీ ఫాన్స్ ని అలరించింది. గ్లామరస్ యాంకర్లు ఇప్పుడు బోలెడు మంది ఉన్నారు కానీ ఒకప్పుడు అలాంటి యాంకర్ అంటే మాత్రం ఉదయభానే. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని పర్సనాలిటీ, అందంతో అందరి మనసు దోచుకుంది. అందం మాత్రమే కాకుండా తన మాటలతో మంత్రముగ్దులను చేసేది.
ఉదయభాను అనగానే హృదయాంజలి షో, సాహసం చేయరా డింభకా, డాన్స్ బేబీ డాన్స్ వంటి షోలు గుర్తొస్తాయి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదయభాను ఆ తరువాత బుల్లితెరకి దూరమైంది. ఇక ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను టీవీకి, సినిమాలకు పూర్తిగా దూరమైంది. కూతుర్లు పెద్దగా అవ్వడంతో మళ్ళీ యాంకర్ గా బిజీగా ఉండాలని భావించిన ఉదయభాను ఆ దిశగా ప్రయత్నించినా అవకాశాలు రావడం లేదు.
ఇక యూట్యూబ్ లో ఛానెల్ పెట్టి తన వ్యక్తిగత జీవితాన్ని అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటున్న ఉదయభాను రీసెంట్ గా తన చిన్న కూతురుతో ఉన్న వీడియోని షేర్ చేసింది. రోజూ ఉదయాన్నే టీ తాగాలనుకుంటే.. నా భూమి తల్లి టీ పెట్టడానికి కావాల్సిన పదార్థాలు కలిపి నాకు హెల్ప్ చేస్తుంది అంటూ కూతురిని ముద్దాడుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లీకూతురు ఇద్దరు క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…