Samantha : నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత తీవ్రంగా డిస్టర్బ్ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని ఆమె పోస్టులను చూసి అర్థం చేసుకోవచ్చు. అయితే కొంత కాలానికి షరా మూమూలే అన్నట్లుగా అంతా సద్దుమణుగుతుంది. కానీ సమంత విడాకుల విషయానికి మాత్రం ఇప్పట్లో ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపించడం లేదు. ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ నడుస్తోంది.
ఇక నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం చాలా మంది సమంతదే తప్పు అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వీరి విడాకుల టాపిక్ ఇప్పటికీ సెన్సేషనల్గానే మారింది. పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు వీరి విడాకులపై తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. అయితే సమంతకు చెందిన తాజా వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..
సమంత, నాగచైతన్యల విడాకుల విషయం నేపథ్యంలో వారికి ప్రస్తుతం వస్తున్న క్రేజ్ దృష్ట్యా టీఆర్పీ రేటింగ్ను పెంచుకునేందుకు ఓ టాప్ తెలుగు చానల్ సమంతతో ఇంటర్వ్యూ కోసం ప్లాన్ చేసిందట. అయితే ఓ మధ్యవర్తి ద్వారా రాయబారం కూడా నడిపారట. కానీ ఆ వ్యక్తి ద్వారా ఆ చానల్ పంపిన ఆ ఆఫర్ను సమంత తిరస్కరించిందట.
ప్రస్తుతం సమంత, నాగచైతన్యల వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తమ చానల్కు టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ చానల్ వారు సమంతతో ఇంటర్వ్యూకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ సమంత ఆ ఆఫర్ను తిరస్కరించడంతో ఆ చానల్ వారు ఉసూరుమన్నారట.
టీఆర్పీ రేటింగ్స్ కోసం టీవీ చానల్స్ వారు ఏమైనా చేస్తారు. సమంతతో ఇంటర్వ్యూ తీసుకుని దాన్ని ట్రెండింగ్ చేద్దామని అనుకున్నారు. కానీ వీలు కాలేదు. మరి ఆమె ఇక ముందు అయినా ఇంటర్వ్యూలు ఇస్తుందా, లేదా.. అన్నది చూడాలి.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…