Toll Charges : సాధారణంగా మనం రహదారులపై ప్రయాణించేటప్పుడు మధ్య మధ్యలో టోల్ గేట్స్ వస్తుంటాయి. ఇవి అన్ని రహదారులపై కనిపించవు. కొత్తగా నిర్మించిన రాష్ట్ర లేదా జాతీయ రహదారులపై మాత్రమే మనకు టోల్ గేట్స్ కనిపిస్తుంటాయి. అయితే టోల్ గేట్స్ గుండా ప్రయాణించినప్పుడు టూవీలర్స్ను విడిచిపెట్టి మిగిలిన అన్ని వాహనాలకు టోల్ వసూలు చేస్తుంటారు. మరి టూవీలర్స్కు టోల్ చార్జిల నుంచి ఎందుకు మినహాయింపును ఇచ్చారో తెలుసా ? అవే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్లు, వ్యాన్లు, డీసీఎంలు, ట్రక్కులు, లారీలు, బస్సులు, భారీ వాహనాలతో పోలిస్తే.. టూవీలర్లు బరువు తక్కువ. టూవీలర్లు రోడ్డు మీద ప్రయాణించినప్పుడు అయ్యే డ్యామేజ్ కూడా తక్కువే. కనుకనే టూవీలర్స్కు టోల్ వసూలు చేయరు.
ఇక దీని వెనుక ఉన్న ఇంకో కారణం ఏమిటంటే.. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ ఉంటుంది. సాధారణంగా కార్లు, ఆపైన ఉండే భారీ వాహనాలు మాత్రమే రోజూ వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటాయి. టూవీలర్ మీద రోజూ ఎవరూ 100 కిలోమీటర్లు వెళ్లరు. ఎప్పుడో లాంగ్ డ్రైవ్ చేస్తే తప్ప. అంటే.. టూవీలర్లు రోడ్డును తక్కువగా ఉపయోగించుకుంటాయి. కనుక వాటికి టోల్ చార్జిలను వసూలు చేయరు.
ఇక మన దేశంలో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు ఎక్కువగా టూవీలర్స్ వాడుతుంటారు. అలాంటి వారి నుంచి ట్రిప్కు రూ.30-రూ.50 మేర టోల్ చార్జిలను వసూలు చేయడం సరికాదన్నది ప్రభుత్వం భావన. అందుకే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టూవీలర్ల నుంచి టోల్ చార్జిలను వసూలు చేయడం లేదు. ఇదీ.. అసలు విషయం..!
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…