గురువారం, జూన్ 11, 2026
అంత‌ర్జాతీయం

ఈ అలవాటు మీలో లేదా.. కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ!

గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి పై పరిశోధకులు విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా ఎప్పటికప్పుడు ఈ వైరస్ గురించి కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పరిశోధకులు…

ఈ అలవాటు మీలో లేదా.. కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ!

గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి పై పరిశోధకులు విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా ఎప్పటికప్పుడు ఈ వైరస్ గురించి కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పరిశోధకులు తెలియజేశారు. గత రెండు సంవత్సరాల నుంచి లేదా ఎవరికైతే శరీర వ్యాయామం చేసే అలవాటు లేదో అలాంటి వారిలో కరోనా తప్పకుండా సోకుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఒక అధ్యయనం ప్రకారం శారీరక శ్రమ లేని వారిలోఎక్కువ శాతం కరోనా లక్షణాలు కనిపించడమే కాకుండా మరణాల సంఖ్య కూడా వారిలోనే అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. గత రెండు సంవత్సరాల ముందు నుంచి ఎటువంటి శారీరక వ్యాయామం చేయని వారు ఈ మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చేరుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడించారు.

ముఖ్యంగా శారీరక వ్యాయామం చేయనివారు, ముసలి వాళ్లు, అవయవ మార్పిడి చేసుకున్న వారిలో ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుందని తెలిపారు. ధూమపానం, మద్యపానం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు ఉన్న వారిలో కన్నా శారీరక వ్యాయామం లేనివారిలో కరోనా మహమ్మారి తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే తప్పకుండా శారీరక వ్యాయామం అవసరమని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి