Tejaswi Madivada : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో పాపులర్ అయిన తేజస్వి మడివాడ ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఇంకా పెద్ద స్థాయికి వెళ్లలేక పోయింది. అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లో మెరుస్తూ అలాగే మరికొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తోంది. అవి కూడా పెద్దగా ఆదరణ లేని షోలు గానే మిగిలిపోయాయి. కానీ గత కొంతకాలంగా తను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్య్వూల్లో సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై ఆమె చేసిన వాఖ్యలు మాత్రం బాగా వైరల్ అయ్యాయి.
ఇక ఈమె బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో తేజస్వికి, అదే సీజన్ లో విజేతగా నిలిచిన కౌశల్ కి మధ్య జరిగిన గొడవలను కూడా ఎవరూ మర్చిపోరు. ఒకానొక సమయంలో ఆ సీజన్ లో వారిద్దరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరినొకరు అసభ్య పదజాలంతో తిట్టుకోవడం కూడా జరిగింది. అయితే తేజస్వి మాత్రం వారిద్దరి మధ్య జరిగిన గొడవల కారణంగా తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూ లో చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆ సమయంలో కౌశల్ ఆర్మీ కూడా సోషల్ మీడియాలో తన మీద అసభ్యకరమైన మీమ్స్ చేయడం, తనని అసభ్యంగా దూషించడం లాంటివి చేశారని ఆరోపించింది.
ఇక ఇది జరిగిన 4 ఏళ్ల తరువాత ఆ షో వలన తైజస్వి తనకు జరిగిన నష్టాన్ని ఇప్పుడు వివరించింది. కౌశల్ ఆర్మీ తనను తరచూ ఎంతో మానసిక క్షోభకు గురి చేశారని, దాని వలన తాను మద్యానికి బానిస అయ్యానని, డిప్రెషన్ కి గురయ్యానని తెలిపింది. కేవలం సింపతీతోనే కౌశల్ గెలుపొందాడని విమర్శించింది. మరోవైపు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తేజస్వి నటించిన కమిట్మెంట్ అనే సినిమా విడుదల కాబోతున్న ఈ సమయంలో ఆమె ఇలాంటి వాఖ్యలు చేయడం పబ్లిసిటీ కోసమే అని అంటున్నారు. తన కెరీర్ లో వచ్చిన గ్యాప్ ని కవర్ చేయడానికి ఆమె ఈ విధంగా ఎప్పుడో జరిగిన వివాదాన్ని ఇప్పుడు వాడుకుంటుందని ఆరోపిస్తున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…