Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ జోష్ లో ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితం అవుతూనే ఉంది. అయినప్పటికీ ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేశారు. రూ.199 చెల్లించి పే పర్ వ్యూ పద్ధతిలో ఈ మూవీని ప్రేక్షకులు వీక్షించవచ్చు.
ఇక సర్కారు వారి పాట అనంతరం కొద్ది రోజుల పాటు విరామంలో ఉన్న మహేష్ మళ్లీ తన తదుపరి సినిమా చేయనున్నారు. ఆయన త్రివిక్రమ్తో కలిసి త్వరలో ఓ మూవీని చేయనున్నారు. ఇందులో హీరోయిన్గా ఇప్పటికే పూజా హెగ్డెను ఎంపిక చేశారు. పూజా గతంలో మహేష్ తో మహర్షి సినిమా చేయగా.. అది హిట్ అయింది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె అరవింద సమేత, అల వైకుంఠ పురములో సినిమాలను చేసింది. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్ మళ్లీ హిట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ తో ఈ ఏడాది చివరి వరకు సినిమాను పూర్తి చేయాలని మహేష్ భావిస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది నుంచి రాజమౌళి సినిమాను చేయవచ్చని ఆయన ప్లాన్. అదేవిధంగా ఆయన షెడ్యూల్ను కూడా పూర్తి చేయనున్నారని సమాచారం.
అయితే రాజమౌళితో కలసి చేయబోయే సినిమాకు గాను ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే కథ గురించి ఒక హింట్ ఇచ్చారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్, అడ్వెంచర్ జోనర్లలో ఈ మూవీ తెరకెక్కుతుందని అన్నారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే ఈ మూవీ 2023 ఆరంభంలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుండగా.. ఇందులో హీరోయిన్ను అయితే ఇంకా ఎంపిక చేయలేదు. కానీ సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ను మహేష్ కు జోడీగా ఎంపిక చేయాలని చూస్తున్నారట. అయితే ఈ విషయంపై మహేష్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ఆమె సాహోలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. కనుక ఆమె హీరోయిన్గా వద్దే వద్దు.. అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారట. అయితే ఫ్యాన్స్ విజ్ఞప్తిని జక్కన్న పరిగణనలోకి తీసుకుంటారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…