Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంత కొద్ది రోజుల పాటు కోర్టు కేసులంటూ తిరిగింది. తరువాతా ఆ బాధ నుంచి మరిచిపోయేందుకు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ.. ఇతర ప్రాంతాలకు టూర్లు కూడా వేసింది. అయితే విడాకులను అనౌన్స్ చేసిన తరువాత నుంచి సమంత గోల్ మారినట్లు తెలుస్తోంది. కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఆమె పెట్టుకుందని సమాచారం. అందులో భాగంగానే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు.
ముఖ్యంగా ఆమె విడాకుల తరువాత రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు.. ఆహాలో వెబ్ సిరీస్, బాలీవుడ్లో తాప్సీతో కలిసి ఓ మూవీలో నటిస్తుందని అంటున్నారు. ఇక పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్కు ఎలాగూ కన్ఫాం అయిపోయింది. అందులో ఆమె డ్యాన్స్ చేసినందుకు గాను ఏకంగా ఒక్క పాటకే రూ.1.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని అంటున్నారు.
పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సమంత దర్శక నిర్మాతలకు కండిషన్స్ను కూడా పెట్టిందట. కేవలం 5 రోజులు మాత్రమే ఆమె ఆ సాంగ్కు కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పాట షూటింగ్ను ఒకే లొకేషన్లో చేయాలని.. దాన్ని కూడా రామోజీ ఫిలిం సిటీలో చేయాలని చెప్పిందట. దీంతో పుష్ప యూనిట్ ఆమె కండిషన్స్కు ఓకే చెప్పిందని తెలుస్తోంది.
ఇక సమంత వరుస సినిమాలతో బిజీగా మారగా.. విడాకుల అనంతరం ఆమె జోరు పెంచిందని తెలుస్తోంది. నాగచైతన్యతో కలసి ఉన్నప్పుడు ఆమె గోల్ వేరే. ఫ్యామిలీ, పిల్లలు.. అని ప్లాన్ చేసినట్లు గతంలోనే తెలిసింది. అయితే ఇప్పుడు ఆమె విడిపోయింది కనుక.. ఇప్పుడామె ముందున్న లక్ష్యం ఒక్కటే.. డబ్బు సంపాదించడం.. సినిమాల్లో, సిరీస్లలో నటిస్తూ పేరు తెచ్చుకోవడం. అంతే.. మరి ఎంత కాలం సక్సెస్ఫుల్గా రాణిస్తుందో చూడాలి. అసలే అక్కినేని అనే పేరు కూడా పోయింది. మరి ఆమె గ్రాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…