Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంత తన పనేదో తాను చేసుకుంటోంది. అప్పట్లో కొంతకాలం పాటు ఇన్డైరెక్ట్ గా చైతన్య మీద సెటైర్ వేస్తున్నట్లు ఈమె కొన్ని సందేశాలను పోస్ట్ చేసింది. తరువాత వాటిని తగ్గించింది. కానీ తన అప్డేట్స్ గురించి మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. తాను ఏం చేస్తున్నది.. ఏ సినిమాల్లో నటిస్తున్నది.. వెకేషన్కు వెళితే ఆ వివరాలు.. ఇలా అన్నింటినీ సమంత తన ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. కానీ ఇన్ని నెలల్లో ఎప్పుడ కూడా తన విడాకులపై నోరు విప్పలేదు.
టాలీవుడ్లో సమంత, నాగచైతన్య మోస్ట్ క్యూట్ కపుల్గా ఉన్నారు. కానీ వీరు విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. అనే విషయం ఇప్పటికీ ఇంకా ఎవరికీ అర్థం కాలేదు. ఎవరికి వారు తమకు తోచిన కారణాలను చెబుతున్నారు కానీ.. అసలు విడాకులకు దారి తీసేంత మ్యాటర్ వీరి మధ్య ఏం జరిగి ఉంటుంది ? అని ఇప్పటికీ ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే ఈ మాట అటుంచితే దీనిపై సమంత ఇప్పటి వరకు నోరు విప్పలేదు. కానీ ఎట్టకేలకు ఈమె ఈ విషయంపై నోరు విప్పక తప్పదని అంటున్నారు. ఎందుకంటే.. ఈమె ఓ షోలో పాల్గొనబోతుంది కాబట్టి. అందులో ప్రశ్నలు అడిగే అతను మామూలు వ్యక్తి కాదు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత. ఇప్పటికీ ఎంతో మందిని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బందులు పెట్టాడు. దీంతో సమంతను కూడా అలాగే అతను అడగబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆయన ఎవరంటే..
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అంటే తెలియని వారుండరు. సౌత్ సినిమాలను ఎక్కువగా బాలీవుడ్లో ప్రదర్శించేలా హక్కులను తీసుకుంటుంటాడు. అయితే ఈయన గతంలో కాఫీ విత్ కరణ్ పేరిట ఓ షో నిర్వహించారు. ఇప్పుడు ఇదే షోకు చెందిన 7వ సీజన్ నడుస్తోంది. అందుకు గాను ఈ షోలో పాల్గొనేందుకు ఇటీవల సమంత ముంబై వెళ్లింది. అయితే కాఫీ విత్ కరణ్ షో అంటేనే బాగా పాపులర్. ఈయన గతంలో పలువురు బాలీవుడ్ తారలను తన షోకు పిలిచి పర్సనల్ విషయాలను కూడా అడిగారు. దీంతో సమంతను కూడా ఆయన అలాగే అడుగుతారని తెలుస్తోంది. అదే జరిగితే సమంత తాను చైతన్యకు విడాకులు ఎందుకు ఇచ్చిందో చెప్పాల్సి వస్తుంది. అయితే దీనికి గాను కరణ్ జోహార్ ప్రశ్న అడగాలి. కానీ ఇలాంటి విషయాలనే ఆయన ఎక్కువగా అడుగుతారు కనుక.. సమంతను తన విడాకుల విషయమై ప్రశ్న అడుగుతారని తెలుస్తోంది. అయితే దీనికి సమంత ఏమని సమాధానం చెబుతుందా.. అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఏదేమైనా ఇప్పుడీ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…