Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంత తన పనేదో తాను చేసుకుంటోంది. అప్పట్లో కొంతకాలం పాటు ఇన్డైరెక్ట్ గా చైతన్య మీద సెటైర్ వేస్తున్నట్లు ఈమె కొన్ని సందేశాలను పోస్ట్ చేసింది. తరువాత వాటిని తగ్గించింది. కానీ తన అప్డేట్స్ గురించి మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. తాను ఏం చేస్తున్నది.. ఏ సినిమాల్లో నటిస్తున్నది.. వెకేషన్కు వెళితే ఆ వివరాలు.. ఇలా అన్నింటినీ సమంత తన ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. కానీ ఇన్ని నెలల్లో ఎప్పుడ కూడా తన విడాకులపై నోరు విప్పలేదు.
టాలీవుడ్లో సమంత, నాగచైతన్య మోస్ట్ క్యూట్ కపుల్గా ఉన్నారు. కానీ వీరు విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. అనే విషయం ఇప్పటికీ ఇంకా ఎవరికీ అర్థం కాలేదు. ఎవరికి వారు తమకు తోచిన కారణాలను చెబుతున్నారు కానీ.. అసలు విడాకులకు దారి తీసేంత మ్యాటర్ వీరి మధ్య ఏం జరిగి ఉంటుంది ? అని ఇప్పటికీ ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే ఈ మాట అటుంచితే దీనిపై సమంత ఇప్పటి వరకు నోరు విప్పలేదు. కానీ ఎట్టకేలకు ఈమె ఈ విషయంపై నోరు విప్పక తప్పదని అంటున్నారు. ఎందుకంటే.. ఈమె ఓ షోలో పాల్గొనబోతుంది కాబట్టి. అందులో ప్రశ్నలు అడిగే అతను మామూలు వ్యక్తి కాదు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత. ఇప్పటికీ ఎంతో మందిని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బందులు పెట్టాడు. దీంతో సమంతను కూడా అలాగే అతను అడగబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆయన ఎవరంటే..
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అంటే తెలియని వారుండరు. సౌత్ సినిమాలను ఎక్కువగా బాలీవుడ్లో ప్రదర్శించేలా హక్కులను తీసుకుంటుంటాడు. అయితే ఈయన గతంలో కాఫీ విత్ కరణ్ పేరిట ఓ షో నిర్వహించారు. ఇప్పుడు ఇదే షోకు చెందిన 7వ సీజన్ నడుస్తోంది. అందుకు గాను ఈ షోలో పాల్గొనేందుకు ఇటీవల సమంత ముంబై వెళ్లింది. అయితే కాఫీ విత్ కరణ్ షో అంటేనే బాగా పాపులర్. ఈయన గతంలో పలువురు బాలీవుడ్ తారలను తన షోకు పిలిచి పర్సనల్ విషయాలను కూడా అడిగారు. దీంతో సమంతను కూడా ఆయన అలాగే అడుగుతారని తెలుస్తోంది. అదే జరిగితే సమంత తాను చైతన్యకు విడాకులు ఎందుకు ఇచ్చిందో చెప్పాల్సి వస్తుంది. అయితే దీనికి గాను కరణ్ జోహార్ ప్రశ్న అడగాలి. కానీ ఇలాంటి విషయాలనే ఆయన ఎక్కువగా అడుగుతారు కనుక.. సమంతను తన విడాకుల విషయమై ప్రశ్న అడుగుతారని తెలుస్తోంది. అయితే దీనికి సమంత ఏమని సమాధానం చెబుతుందా.. అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఏదేమైనా ఇప్పుడీ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…