Samantha : పెళ్లి, విడాకుల తర్వాత కూడా బిజీగా ఉన్న ఆర్టిస్టులు ఎవరంటే సమంత అనే చెప్పాలి. ఈ అమ్మడు విడాకుల తర్వాత కూడా పలు కార్యక్రమాలతో బిజీ అయింది. గోవాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 52వ ‘భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ)లో పాల్గొన్న ఆమె .. ‘ఫ్యామిలీమ్యాన్–2’ వెబ్ సిరీస్లోని క్లిష్టమైన యాక్షన్ పాత్ర రాజీని తాను ఎంచుకోవడానికి కారణాన్ని వివరించారు. కొత్తదనం కోసం తపిస్తున్న నేను ఆ పాత్రను ఠక్కున పట్టేసుకున్నా అన్నారు సమంత.
52వ ‘ఇఫీ’లో భాగంగా ఫ్యామిలీ మ్యాన్ రూపకర్తలు రాజ్, డీకే, నటి సమంత, అమెజాన్ ఇండియా ఒరిజినల్స్కు హెడ్ అయిన అపర్ణా పురోహిత్లతో ‘మాస్టర్ క్లాస్’ గోష్ఠి జరిగింది. అందులో సమంత మాట్లాడుతూ, ‘‘తెలుగు పరిశ్రమ, హైదరాబాద్ నా పుట్టినిల్లు. నటిగా నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది అవే. నేనింకా హిందీ సినిమాలేవీ చేయలేదు కానీ, ఉత్తరాది పరిశ్రమకూ, దక్షిణాదికీ పెద్ద తేడా ఏమీ లేదు’’ అన్నారు.
ఫ్యామిలీ మ్యాన్ 2’లోని పాత్రతో ఇక హిందీ ‘ధూమ్’ సిరీస్ లాంటి వాటిలో అవకాశాలు రావచ్చన్న ప్రేక్షకుల ప్రశంసకు సమంత ఉబ్బితబ్బిబ్బవుతూ, ‘‘నేనిక ‘యాక్షన్ స్టార్’ అన్న మాట’’ అని నవ్వేశారు.
దర్శకులు రాజ్ అండ్ డీకే మాట్లాడుతూ, ‘‘రాజీ పాత్రకు తమిళం తెలిసిన నటి కావాలనుకున్నాం. తమిళ చిత్రం ‘సూపర్డీలక్స్’, తెలుగు ‘రంగస్థలం’ చూసి, ఆ పాత్రకు సమంత సరిపోతారనుకొని, సంప్రదించాం. మా అంచనాలను మించి ఆమె చేశారు. భావోద్వేగాల్లోనే జీవిస్తూ, కొన్ని సీన్లు కాగానే ఆమె వెక్కివెక్కి ఏడ్చిన ఘటనలు మాకు ఇప్పటికీ గుర్తే. చేతులకు గాయమై రక్తం కారుతున్నా డూప్లు లేకుండా సమంత చేసిన ఫైట్లు చూసి ఆశ్చర్యపోయాం’’ అన్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…