Sai Pallavi : గత కొద్ది రోజులుగా నటి సాయిపల్లవిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్న విషయం విదితమే. ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను కొందరు తప్పు పడుతుండగా.. కొందరు మాత్రం ఆమెను సమర్థిస్తున్నారు. ఆమె కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్ల హత్యలు, గోహత్యలు రెండూ ఒకటేనని.. పెద్దగా తేడా ఏమీ లేదని కామెంట్స్ చేసింది. విరాట పర్వం సినిమా రిలీజ్కు ముందు ఇలా కామెంట్స్ చేయడంతో ఆమె తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకే ఇలా అని ఉంటుందని.. ఇలాంటి సున్నితమైన అంశాలపై కామెంట్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని కొందరు ఆమెకు క్లాస్ పీకారు. ఇక కొందరు అయితే ఆమెకు మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుండడంతో ఎట్టకేలకు సాయి పల్లవి స్పందించింది. ఈమేరకు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో ఆమె చెప్పిందంటే..
దేశంలో అనేక హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని.. వాటిని వివరించేందుకు తాను కాశ్మీర్ పండిట్ల హత్యలను, గోహత్యలను రిఫరెన్స్ గా తీసుకున్నానని.. అంతేకానీ.. ఒకరంటే తనకు ద్వేషం లేదని సాయి పల్లవి తెలియజేసింది. అసలు మతం ముఖ్యం కాదని.. హింస ఏ రూపంలో ఏ మతం ద్వారా జరిగినా సమ్మతం కాదని.. దాన్ని మాత్రమే తాను వివరించి చెప్పానని.. అయితే తాను చేసిన అసలు కామెంట్స్ను చూపించకుండా కొందరు తన వీడియోను ఎడిట్ చేశారని.. కనుకనే తన కామెంట్స్పై వివాదం నెలకొందని సాయిపల్లవి స్పష్టం చేసింది.
అయితే తన వ్యాఖ్యల ద్వారా ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆమె కోరింది. హింస అనేది పనికిరాదని.. ఏ మతం రూపంలో హింస జరిగినా ఖండించాల్సిందేనని తాను చెప్పదలుచుకున్నానని.. కానీ తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా చూపించేసరికి వివాదం ఏర్పడిందని.. సాయి పల్లవి తెలియజేసింది. అయితే ఆమె క్షమాపణలు చెప్పాలని చాలా మంది డిమాండ్ చేస్తుండగా.. ఎట్టకేలకు ఆమె స్పందించి క్షమాపణలు చెప్పేసింది. మరి ఈ వివాదం ఇక్కడితో అయినా సద్దుమణుగుతుందా.. లేక ఇంకా కొనసాగుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…