మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దాదాపుగా 35 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ దసరా రోజు ఇంటికి చేరుకున్నాడు. దీపావళి రోజు మెగా హీరోలు అందరితో కలిసికట్టుగా ఫొటో దిగి మెగా అభిమానులకి అదిరిపోయే ట్రీట్ అందించాడు. ఇక సాయి ధరమ్ ఇంతకు ముందులా మళ్లీ ఎప్పుడు పలకరిస్తాడా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు.
నవంబర్ 26న రిపబ్లిక్ సినిమా జీ5 ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్కు వాయిస్ మెసేజ్ పంపించాడు తేజూ. ఈ మెసేజ్కు ముందు రిపబ్లిక్ సినిమాలోని ఓ సీన్ను జోడించారు. అనంతరం సాయితేజ్ ఆడియో మెసేజ్ ఉంది. నేను మీ సాయిధరమ్ తేజ్.. మీరు నా మీద చూపించిన ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.. నా ఆరోగ్యంపై మీరు చూపించిన శ్రద్ధ ఎప్పటికీ మర్చిపోలేను.. రిపబ్లిక్ సినిమాను మీతో కలిసి చూడలేకపోయాను.
కానీ ఇప్పుడు నవంబర్ 26న ఈ సినిమా జీ 5లో విడుదల అవుతోంది. ఈ సినిమాను చూసి మీ అభిప్రాయాలు నాకు తెలపండి అంటూ వాయిస్ మెసేజ్ పంపించాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్టోబర్ 1న విడుదలైన రిపబ్లిక్ దాదాపుగా 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతోంది.
ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనపై చూపించిన ప్రేమ, కురిపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సాయితేజ్ పేర్కొన్నారు. రిపబ్లిక్ సినిమాను థియేటర్లో మీతో కలిసి చూడలేకపోయానని, కానీ ఆ సినిమా ఈ నెల 26న జీ5లో విడుదల అవుతోందని పేర్కొన్నారు. సినిమాను చూసి స్పందించాలని కోరిన సాయితేజ్ చివర్లో జై హింద్ అని ముగించారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…