మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దాదాపుగా 35 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ దసరా రోజు ఇంటికి చేరుకున్నాడు. దీపావళి రోజు మెగా హీరోలు అందరితో కలిసికట్టుగా ఫొటో దిగి మెగా అభిమానులకి అదిరిపోయే ట్రీట్ అందించాడు. ఇక సాయి ధరమ్ ఇంతకు ముందులా మళ్లీ ఎప్పుడు పలకరిస్తాడా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు.
నవంబర్ 26న రిపబ్లిక్ సినిమా జీ5 ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్కు వాయిస్ మెసేజ్ పంపించాడు తేజూ. ఈ మెసేజ్కు ముందు రిపబ్లిక్ సినిమాలోని ఓ సీన్ను జోడించారు. అనంతరం సాయితేజ్ ఆడియో మెసేజ్ ఉంది. నేను మీ సాయిధరమ్ తేజ్.. మీరు నా మీద చూపించిన ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.. నా ఆరోగ్యంపై మీరు చూపించిన శ్రద్ధ ఎప్పటికీ మర్చిపోలేను.. రిపబ్లిక్ సినిమాను మీతో కలిసి చూడలేకపోయాను.
కానీ ఇప్పుడు నవంబర్ 26న ఈ సినిమా జీ 5లో విడుదల అవుతోంది. ఈ సినిమాను చూసి మీ అభిప్రాయాలు నాకు తెలపండి అంటూ వాయిస్ మెసేజ్ పంపించాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్టోబర్ 1న విడుదలైన రిపబ్లిక్ దాదాపుగా 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతోంది.
ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనపై చూపించిన ప్రేమ, కురిపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సాయితేజ్ పేర్కొన్నారు. రిపబ్లిక్ సినిమాను థియేటర్లో మీతో కలిసి చూడలేకపోయానని, కానీ ఆ సినిమా ఈ నెల 26న జీ5లో విడుదల అవుతోందని పేర్కొన్నారు. సినిమాను చూసి స్పందించాలని కోరిన సాయితేజ్ చివర్లో జై హింద్ అని ముగించారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…