Rashmi Gautam : బుల్లితెరపై సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న యాంకర్లలో యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు. ఈ అమ్మడికి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో టీవీ షోలతోనే సరిపెట్టుకుంటోంది. అయినప్పటికీ ఆ షోలలో ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా పాపులర్ షో జబర్దస్త్లో అయితే సుడిగాలి సుధీర్ తో ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ విధంగా రష్మి అందరినీ అలరిస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలోనూ ఈమె ఎంతో యాక్టివ్గా ఉంటుంది. అందులో తనకు చెందిన అప్డేట్స్ను పోస్ట్ చేస్తుంటుంది. ఇక రష్మికి మూగజీవాలు అంటే చాలా ప్రేమ అన్న విషయం తెలిసిందే.
మూగజీవాల కోసం రష్మి ఎంతో తాపత్రయ పడుతుంది. ఈమెకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఈ విషయం పట్ల రష్మికి చాలా మంది అభిమానులు కూడా ఏర్పడ్డారు. ఇక కరోనా సమయంలో అయితే వీధి కుక్కలకు ఈమె తిండి పెట్టి ఆదరించింది. ఎన్నో కుక్కల కోసం రెస్క్యూ కార్యక్రమాలను చేపట్టింది. ఇక ఎక్కడైనా మూగజీవాలు గాయపడ్డాయనో.. లేదా హింసించబడ్డాయనో తెలిస్తే.. ఈమె తీవ్రంగా విచారిస్తుంది. వాటిని హింసించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే రష్మి ఈ విషయంపై తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా.. అది వైరల్ గా మారింది.
రష్మి పాలు, పాల ఉత్పత్తులను తీసుకోదు. వాటికి ఆమె ఎల్లప్పుడూ దూరమే. మనం రోజూ తాగే పాలు, తినే పెరుగు, నెయ్యి కోసం మూగజీవాలను డెయిరీలలో చాలా హింసిస్తారని.. అందుకనే తనకు ఆ ఉత్పత్తులు పడవని ఆమె గతంలో ఎప్పుడో చెప్పింది. ఇక మనం రోజూ తాగే పాల కోసం ఆ మూగజీవాలను ఎలా హింసిస్తారో చూడండి.. అంటూ రష్మి పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో గేదెకు పాల కోసం సూదులు గుచ్చడం వంటివి చేస్తున్నారు. ఇది డెయిరీ రంగంలో జరుగుతుందని, కనుక ఇలా చేయవద్దని ఆమె కోరింది. ఇది చాలా దారుణమని.. వాటిని హింసించేందుకు మనం డబ్బులు ఇస్తున్నామని ఆమె పేర్కొంది. ఇలా చేయడం కూడా అత్యాచారం కిందకే వస్తుందని రష్మి తెలియజేసింది. కనుక జంతువులకు కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుందని.. వాటిని హింసించవద్దని ఆమె కోరింది. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…