Mohan Babu : చాలా కాలం తరువాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా.. ఈ మూవీ ఫిబ్రవరి 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సమయంలో మంచు ఫ్యామిలీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల ఈ మూవీని దారుణంగా ట్రోల్ చేశారు. అసలు తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక ట్రోల్స్ ను, విమర్శలను ఎదుర్కొన్న మూవీగా సన్ ఆఫ్ ఇండియా రికార్డులను సృష్టించిందని చెప్పవచ్చు. ఓ దశలో మంచు ఫ్యామిలీ తమపై వస్తున్న ట్రోల్స్, విమర్శలకు స్పందించి.. ఎవరైనా తమను కించ పరిచేలా పోస్టులు పెట్టినా, వీడియోలను అప్లోడ్ చేసినా రూ.10 కోట్ల వరకు పరువు నష్టం దావా వేస్తామని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ ఆ విషయంపై కూడా వారి మీద ట్రోల్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ సైలెంట్గా ఓటీటీలో రిలీజ్ అయింది.
మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా మూవీ ఎలాంటి ప్రకటనా హడావిడి లేకుండానే సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం ప్రస్తుతం అందుబాటులో ఉంది. మే 17 నుంచి ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. దీన్ని ప్రేక్షకులు చూడదలిస్తే చూడవచ్చు. ఇక ఈ మూవీలో మీనా, ప్రగ్యా జైశ్వాల్, శ్రీకాంత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అయితే థియేటర్లలోనే ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకున్న ఈ మూవీని ఓటీటీలో చూస్తారా ? అసలు ప్రేక్షకులు అంత సాహసం చేస్తారా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
సన్ ఆఫ్ ఇండియా మూవీపై వాస్తవానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. అయితే ఆ సమయంలో మంచు ఫ్యామిలీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏమీ పట్టనట్లు ఉంటున్నారని చెప్పి.. ప్రేక్షకులు సహజంగానే మంచు ఫ్యామిలీపై వ్యతిరేకతను ఏర్పరుచుకున్నారు. అందులో భాగంగానే ఆ తరువాత వచ్చిన సన్ ఆఫ్ ఇండియా మూవీపై తమ ప్రతీకారం అంతా చూపించారు. కనుకనే ఆ మూవీ గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఘోర ఓటమిని చవిచూసింది. ఇక ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉండడంతో దీన్ని ఎంత మంది చూస్తారు.. మళ్లీ ఏమైనా ట్రోల్స్ వస్తాయా.. వాళ్లను విమర్శలు చేస్తారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…