Ramya Raghupathi : సీనియర్ నటుడు నరేష్ కుటుంబ వ్యవహారం ప్రస్తుతం రోడ్డుకెక్కింది. పవిత్రా లోకేష్తో ఆయన మైసూర్ హోటల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. దీంతో ఆయన అభాసు పాలవుతున్నారు. ఆయన భార్య రమ్య రఘుపతి వారిని పట్టుకుంది. అయితే అదే సమయంలో పవిత్రను ఆమె చెప్పుతో కొట్టేందుకు యత్నించింది. కానీ అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. తరువాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ సంఘటనపై స్పందించిన రమ్య మాట్లాడుతూ నరేష్, పవిత్ర లోకేష్లపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.
తాను నరేష్ భార్యనే అని.. ఆయన తనకు ఇంకా విడాకులు ఇవ్వనేలేదని రమ్య స్పష్టం చేశారు. తనను నరేష్ మాజీ భార్య అని చెబుతున్నారని.. చట్ట ప్రకారం ఇది సరికాదని అన్నారు. తాము ఇంకా విడాకులు తీసుకోలేదు కనుక తాను ఆయన భార్యనే అని అన్నారు. అయితే భార్య ఉండగానే ఇంకో మహిళతో సంబంధం పెట్టుకోవడం లేదా ఆమెను పెళ్లి చేసుకోవడం అనేవి చట్ట ప్రకారం నేరాలని.. కనుక నరేష్కు శిక్ష పడుతుందని అన్నారు. ఇక పవిత్ర లోకేష్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని.. వారు పెళ్లి చేసుకున్నారని.. కానీ అది చట్ట ప్రకారం చెల్లదని.. రమ్య అన్నారు.
పవిత్ర లోకేష్ తనను తాను నరేష్కు మంచి ఫ్రెండ్ అని చెప్పుకుని తిరుగుతోందని.. కానీ వారి మధ్య అక్రమ సంబంధం ఉందని రమ్య అన్నారు. తాను న్యాయ పోరాటం చేస్తానని.. ఇందులో తాను విజయం సాధిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే రమ్య ఒక కొత్త పాయింట్ను బయట పెట్టడంతో ఈ విషయం మరింత వైరల్గా మారింది. పవిత్ర, నరేష్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని రమ్య ఆరోపణలు చేసింది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అన్నది తెలియాల్సి ఉంది. కానీ నరేష్ కుటుంబం మాత్రం అవమానాల పాలవుతుందని చెప్పవచ్చు.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…