Radhe Shyam : బాహుబలి సినిమా విజయం హీరో ప్రభాస్ ని ఒక్క సారిగా పాన్ ఇండియా స్టార్ ని చేసేసింది. తెలుగు సినీ పరిశ్రమలో ఆ ఖ్యాతిని అందుకున్న వాళ్లలో ప్రభాస్ మొదటి వ్యక్తిగా చెప్పవచ్చు. కానీ ఆ తరువాత ఆయన నుండి వచ్చిన సాహో సినిమా గానీ, రాధేశ్యామ్ కానీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక పోయాయి. మంచి ఓపెనింగ్ కలెక్షన్లతో సాహో కాస్త ఫరవాలేదనిపించినా, రాధేశ్యామ్ సినిమా మాత్రం దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కి, అద్భుతమైన విజువల్స్ తో, గొప్ప ప్రేమ కథతో నిండిన దృశ్యకావ్యం అని చెప్పినప్పటికీ, అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకోలేక తీవ్ర నిరాశకు గురి చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ చిత్ర యూనిట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయితే రాధేశ్యామ్ సినిమా విడుదలై 5 నెలలు గడుస్తున్నా ఇంకా ఆ చిత్రానికి ట్రోలింగ్ బెడద తప్పడం లేదు. అంటే ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగా నిరాశకు గురి చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక దర్శకుడు రాధాకృష్ణ ను మాత్రం వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో ఒక ఆటాడుకుంటున్నారు. ఇక అప్పటి నుండి ఏదైనా సినిమా హిట్ అవడం ఆలస్యం, ఆ చిత్రాన్ని రాధేశ్యామ్ సినిమాతో పోలుస్తూ దర్శకుడు రాధాకృష్ణ ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒకరి పెళ్లి ఇంకొకరి చావుకి కారణం అవడం అంటే ఇదేనేమో.
ఇలాగే ప్రేమకథ తో తీసిన సీతారామం సినిమా కూడా ఈ మధ్యే విడుదలై మంచి విజయం సాధించింది. దాంతో కొందరు అభిమానులు ఇదే హృదయాన్ని హత్తుకునే నిజమైన ప్రేమకథ అని, సీతారామం సినిమాని పొగుడుతూ, ఆర్టిఫిషియల్ ప్రేమకథలా ఉందని రాధేశ్యామ్ సినిమాని, ఆ చిత్ర దర్శకున్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
అంతే కాకుండా.. ఈ మధ్య చిన్న బడ్జెట్ తో విడుదలై ఉత్తరాదిన కూడా మంచి వసూళ్లు రాబడుతున్న కార్తికేయ 2 సినిమా ఇప్పటికే రూ.15 కోట్లు వసూలు చేసింది. ఇంకా రాధేశ్యామ్ మొత్తంగా వసూలు చేసిన రూ.18 కోట్ల కలెక్షన్ల ను కూడా మించి వసూలు చేసేలా ఉంది. దీంతో కొందరు రాధేశ్యామ్ సినిమాను కార్తికేయ 2 సినిమాతో పోల్చి మళ్లీ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఇలాంటి ట్రోలింగ్ ల బారి నుండి ఈ సినిమా ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…